Tollywood Stars : ఓటు హక్కును వినియోగించుకోండి!

ABN , First Publish Date - 2023-11-30T16:49:53+05:30 IST

లంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు (Assemblyelection 2023) వినియోగించుకునేందుకు సినీతారలు ఆసక్తి చూపించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలైన్‌లలో నిల్చొని తమ ఓటు హక్కును (Elections 2023) వినియోగించుకున్నారు.

Tollywood Stars : ఓటు హక్కును వినియోగించుకోండి!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు (Assemblyelection 2023) వినియోగించుకునేందుకు సినీతారలు ఆసక్తి చూపించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలైన్‌లలో నిల్చొని తమ ఓటు హక్కును (Elections 2023) వినియోగించుకున్నారు. ఉదయం చిరంజీవి దంపతులు, నాగార్జున కుటుంబ సభ్యులు, రవితేజ, సుకుమార్‌, తారక్‌, అల్లు అర్జున్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ‘మేము మా బాధ్య్యత నిర్వర్తించాం. మరి మీరు?’’ అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. అంతే కాదు ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ కాసేపు సమయాన్ని కేటియించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

Ram charan.jpg

మధ్యాహ్నం  2.30 గంటల సమయంలో  రామ్‌చరణ్‌-ఉపాసన, (Ram charan -Upasana)మహేష్‌బాబు(Maheshbabu)-నమ్రత, రాజమౌళి-రమా (Rama rajamouli), ఆది, రామ్‌ పోతినేని, నిఖిల్‌, నందమూరి మోక్షజ్ఞ , సిద్ధార్థ్‌ వంటి స్టార్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. 'మేంఇప్పుడే  ఓటేసి వచ్చాం.. మరి మీరు?’ అని మహేష్‌బాబు ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.

Ntr.jpeg


Updated Date - 2023-11-30T17:07:14+05:30 IST