మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mahesh - Rajamouli : Animal వేదికగా.. ఏమైనా అప్‌డేట్‌ ఇస్తారా జక్కన్నా?

ABN, Publish Date - Nov 27 , 2023 | 10:09 AM

బాలీవుడ్‌ హీరో రణబీర్‌ కపూర్‌(Ranbir kapoor), రష్మిక (Rashmika mandanna) జంటగా నటించిన యానిమల్‌ (Animal)+చిత్రంపె భారీ అంచనాలు నెలకొన్నాయి. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పాన్  ఇండియా స్థాయిలో డిసెంబర్‌ 1న విడుదల చేస్తున్నారు.

బాలీవుడ్‌ హీరో రణబీర్‌ కపూర్‌(Ranbir kapoor), రష్మిక (Rashmika mandanna) జంటగా నటించిన యానిమల్‌ (Animal)+చిత్రంపె భారీ అంచనాలు నెలకొన్నాయి. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పాన్  ఇండియా స్థాయిలో డిసెంబర్‌ 1న విడుదల చేస్తున్నారు. ప్రచార కార్యక్రమాలు  కూడా వినూత్నంగా చేస్తున్నారు. తండ్రీ కొడుకుల బంధం, యాక్షన్  ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రం 3:21 గంటలు అనే వార్త బయటకు రాగానే అందరూ ఇంత నిడివి అయితే చాలా కష్టం అని పెదవి విరిచారు. అయితే తాజాగా విడుదలైన 'యానిమల్‌' ట్రైలర్‌ను చూసిన తర్వాత ప్రేక్షకుల్లో మార్పు వచ్చింది. సోమవారం (నవంబర్‌ 27) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఘనంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో సాయంత్రం ఈ కార్యక్రమం జరగనుంది. ఆ ఈవెంట్‌కు సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదిక నిర్మాణ సంస్థ టీ సిరీస్‌ వెల్లడించింది. దీంతో ఇద్దరి అభిమానులు ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. వేదిక దగ్గర హంగామా చేయడానికి సిద్ధమవుతున్నారు.

మహేశ్‌-జక్కన్న కాంబోలో ఎస్‌ఎస్‌ఎంబీ29 చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే! ఈ సినిమా ప్రకటించి చాలాకాలం అయినా ఇప్పటిదాకా ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కథ ప్రీ ప్రొడక్షన్స్‌ దశలో ఉంది. త్వరలో సెట్స్‌ పైకి వెళ్లనుంది. మరి యానిమల్‌ ప్రీ రిలీజ్‌ వేడుక వేదిక ఏమైనా అప్‌డేట్‌ ఇస్తారేమో చూడాలి.

Updated Date - Feb 20 , 2024 | 12:47 PM