Shastipoorthi: 37 ఏళ్ళ తర్వాత ‘లేడీస్‌ టైలర్‌ కాంబినేషన్‌ రిపీట్‌!

ABN , First Publish Date - 2023-04-01T20:06:06+05:30 IST

డా. రాజేంద్ర ప్రసాద్‌, అర్చన ఈ జోడీ పేర్లు వింటే ‘లేడీస్‌ టైలర్‌’ గుర్తుకు వస్తుంది. ‘సుజాతా....మై మర్‌ జాతా’ డైలాగును గుర్తొస్తుంది. తెలుగులో ట్రెండ్‌ స్టెర్‌ చేసిన చిత్రాల్లో ఇదొకటి.

Shastipoorthi: 37 ఏళ్ళ తర్వాత ‘లేడీస్‌ టైలర్‌ కాంబినేషన్‌ రిపీట్‌!

డా. రాజేంద్ర ప్రసాద్‌(rajendra prasad), అర్చన (Archana)ఈ జోడీ పేర్లు వింటే ‘లేడీస్‌ టైలర్‌’ (ladies tailor) గుర్తుకు వస్తుంది. ‘సుజాతా....మై మర్‌ జాతా’ డైలాగును గుర్తొస్తుంది. తెలుగులో ట్రెండ్‌ స్టెర్‌ చేసిన చిత్రాల్లో ఇదొకటి. ఆ సినిమా వచ్చిన 37 ఏళ్లకు మళ్లీ కాంబినేషన్‌ రిపీట్‌ (After 37 years Combination repeat) అవుతోంది. ఓ కొత్త సినిమాలో సూపర్‌ హిట్‌ జోడీ నటిస్తోంది. రాజేంద్ర ప్రసాద్‌, అర్చన ప్రధాన పాత్రల్లో ‘షష్టిపూర్తి’ (Shastipoorthi) చిత్రం రూపొందుతోంది. రూపేష్‌ కుమార్‌ చౌదరి, ఆకాంక్షా సింగ్‌ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు పవన్‌ ప్రభ దర్శకుడు. రూపేష్‌ కుమార్‌ చౌదరి నిర్మాత. చెన్నైలోని ఇసైజ్ఞాని ఇళయరాజా స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది(Shastipoorthi movie launch). ముహూర్తపు సన్నివేశానికి ఇళయరాజా కెమెరా స్విచాన్‌ చేయగా... సూపర్‌ గుడ్‌ ఫిలింస్‌ ఆర్‌బి చౌదరి క్లాప్‌ ఇచ్చారు.

నిర్మాత రూపేష్‌ కుమార్‌ చౌదరి మాట్లాడుతూ ‘‘రాజేంద్ర ప్రసాద్‌,, ఇళయరాజా వంటి లెజెండ్స్‌తో సినిమా చేేస అవకాశం రావడం సంతోషంగా ఉంది. ‘లేడీస్‌ టైలర్‌’ తర్వాత రాజేంద్ర ప్రసాద్‌, అర్చన గారు చేస్తున్న చిత్రమిది. ‘లేడీస్‌ టైలర్‌’ తర్వాత రాజేంద్ర ప్రసాద్‌, ఇళయరాజా కాంబినేషన్‌లో ‘ఆస్తులు అంతస్థులు’ ‘చెట్టు కింద ప్లీడర్‌’, ‘ఏప్రిల్‌ 1 విడుదల’ వంటి మ్యూజికల్‌ హిట్స్‌ వచ్చాయి. చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ కాంబినేషన్‌ కూడా రిపీట్‌ అవుతోంది. సినిమాలో మొత్తం నాలుగు పాటలుంటాయి. ఇదొక న్యూ ఏజ్‌ ఫ్యామిలీ డ్రామా. ఈ నెలలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెడతాం. జూలైలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని అన్నారు.

Updated Date - 2023-04-01T20:19:56+05:30 IST