KGF: క్రేజీ అప్‌డేట్‌!

ABN , First Publish Date - 2023-01-24T18:11:02+05:30 IST

యశ్‌ హీరోగా(yash) ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ‘కేజీయఫ్‌2’ (kgf 2)చిత్రం ప్యాన్‌ ఇండియా స్థాయిలో ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఆ చిత్రం, హీరో యశ్‌ ఓ బ్రాండ్‌గా మారిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.1250కోట్లకు పైగా వసూళ్లు చేసింది. తాజాగా ,చిత్ర నిర్మాణ సంస్థ నిర్వాహకులు ‘కేజీయఫ్‌’ సిరీస్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పారు.

KGF: క్రేజీ అప్‌డేట్‌!

యశ్‌ హీరోగా(yash) ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ‘కేజీయఫ్‌2’ (kgf 2)చిత్రం ప్యాన్‌ ఇండియా స్థాయిలో ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఆ చిత్రం, హీరో యశ్‌ ఓ బ్రాండ్‌గా మారిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.1250కోట్లకు పైగా వసూళ్లు చేసింది. తాజాగా ,చిత్ర నిర్మాణ సంస్థ నిర్వాహకులు ‘కేజీయఫ్‌’ సిరీస్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పారు. ‘కేజీయఫ్‌’ మొత్తం ఐదు భాగాలుగా (kgf in five parts)తెరకెక్కిస్తునట్లు వివరించారు. ఇప్పటికే రెండు భాగాలు ప్రేక్షకుల ముందుకొచ్చి సంచలనం సృష్టించాయి. రానున్న మూడు భాగాల్లో ఒక్కో హీరో ఉండనున్నట్లు వెల్లడించారు. 2025లో సెట్‌కు వెళ్లనున్న ‘కేజీయఫ్‌3’లో యశ్‌ కనిపిస్తారా లేదా అని అభిమానులు ఆలోచనలో పడ్డారు.

ప్రస్తుతం ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ (prasanth neel)రూపొందిస్తోన్న చిత్రం ‘సలార్‌’కు సంబంధించిన కూడా క్రేజీ అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో యశ్‌ నటిస్తున్నట్లు వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఇందులో రాఖీభాయ్‌ అతిథి పాత్రలో సందడి చేయనున్నారని నెట్టింట టాక్‌ నడుస్తోంది. ఇప్పటికే ప్రశాంత్‌నీల్‌ యశ్‌ను అప్రోచ్‌ అయ్యారని ఆయన ఓకే చేశారని తెలుసోతంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇద్దరు ప్యాన్‌ ఇండియా స్టార్లు ఒకే సినిమాలో మెరవనున్నారన్న వార్తను అభిమానులు విపరీతంగా షేర్‌ చేస్తున్నారు.

Updated Date - 2023-01-24T18:12:06+05:30 IST