Kishore Kumar: కెజియఫ్ 2 చెత్త సినిమా

ABN , First Publish Date - 2023-01-06T19:09:58+05:30 IST

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన ‘కెజియఫ్: చాప్టర్ 2’ సినిమా ఎంతంటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. గత ఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిగా చిత్రంగా రికార్డు సృష్టించింది. వరల్డ్ వైడ్‌ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1200కోట్ల కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది.

Kishore Kumar: కెజియఫ్ 2 చెత్త సినిమా

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన ‘కెజియఫ్: చాప్టర్ 2’ సినిమా ఎంతంటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. గత ఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిగా చిత్రంగా రికార్డు సృష్టించింది. వరల్డ్ వైడ్‌ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1200కోట్ల కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ఈ మూవీ విడుదలైన ప్రతి చోట సంచలనం సృష్టించింది. ఈ సినిమాను కాంతార నుటుడు కిశోర్ కుమార్ (Kishore Kumar) తాజాగా విమర్శించాడు. అదో చెత్త సినిమా అని చెప్పాడు.

కాంతార సినిమాలో ఫారెస్టాఫీసర్‌గా నటించి ఫేమ్ సంపాదించుకున్న వ్యక్తి కిశోర్ కుమార్. తన నటనతో అందరిని మెస్మరైజ్ చేశాడు. కిశోర్ తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ‘‘కెజియఫ్ లాంటి చిత్రాలకు నేను అభిమానిని కాను. సమస్యలను చర్చించే కంటెంట్ తరహా సినిమాలు చిన్నవైనప్పటికీ వాటిని చూడటానికి నేను ఇష్టపడతాను. చెత్త విజువల్ వండర్స్‌ను చూడటం నాకిష్టం ఉండదు’’ అని కిశోర్ కుమార్ చెప్పాడు. అభిప్రాయలను వెల్లడించేటప్పుడు కిశోర్ ఆచితూచి మాట్లాడుతుంటాడు. అతడు ఈ విధంగా చెప్పడంతోనే ప్రతి ఒక్కరు సర్‌ప్రైజ్‌కు గురయ్యారు. అతడి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆశ్యర్యకరమైన విషయమేమిటంటే కెజియఫ్ ప్రాంచైజీని, కాంతార సినిమాను ఒకే చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్సే నిర్మించింది.

‘కెజియఫ్: చాప్టర్ 2’ కు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. సంజయ్ దత్, రవీనా టండన్, ప్రకాశ్ రాజ్, శ్రీనిధి శెట్టి, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ, తెరకెక్కించిన చిత్రం ‘కాంతార’. లో బడ్జెట్ రూ.16కోట్లతో మూవీని రూపొందించగా రూ. 400కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

Updated Date - 2023-01-06T19:10:00+05:30 IST