Kantara: రెండో భాగానికి సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2023-08-21T17:20:13+05:30 IST

రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార’ పాన్‌ ఇండియా స్థాయిలో ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో తెలిసిందే! చిన్న సినిమా మొదలై, ఎలాంటి అంచనాలు లేకుండా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రాసికి కొనసాగింపు ఉంటుందని దర్శకుడు రిషబ్‌ ముందే చెప్పారు.

Kantara: రెండో భాగానికి సర్వం సిద్ధం

రిషబ్‌ శెట్టి (Rishab shetty) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార’ (Kantara) పాన్‌ ఇండియా స్థాయిలో ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో తెలిసిందే! చిన్న సినిమా మొదలై, ఎలాంటి అంచనాలు లేకుండా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రాసికి కొనసాగింపు ఉంటుందని దర్శకుడు రిషబ్‌ ముందే చెప్పారు. అయితే ఈ చిత్రం ఎప్పుడు మొదలువుతుందా అని కాంతారా ఫ్యాన్‌ ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధింఇన ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. రిషబ్‌ శెట్టి తన టీమ్‌తో కలిసి ప్రీక్వెల్‌కు సంబంధించిన స్ర్కిప్ట్‌ పనులన్నీ పూర్తి చేశారట. మొదటి భాగం షూటింగ్‌ను ఎక్కువ శాతం ఆయన సొంత ఊరు ఐవర్‌ కందపురలో చేశారని.. ఇక రెండో భాగాన్ని బెంగుళూర్‌లోని పలు ప్రాంతాల్లో చిత్రీకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తొలి భాగాన్ని తక్కువ బడ్జెట్‌ తెరకెక్కించిన ఆయన ప్రీక్వెల్‌కు భారీ బడ్జెట్‌తో ప్లాన్‌ చేస్తున్నారట. అలాగే నటీనటుల ఎంపికలో కూడా మార్పులు చేయనున్నారని టాక్‌. నాలుగు షెడ్యూళ్లలో పూర్తి చేయాలని రిషబ్‌ భావించారట. వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్‌ పూర్తి చేస్తారట.‘కాంతార’ తొలిభాగం ఎక్కడైతే ప్రారంభమైందో దానికి ముందు జరిగిన సంఘటనలను ఈ ప్రీక్వెల్‌లో చూపించనున్నారు. ఇందులో పంజుర్లి దేవతకు సంబంధించిన సన్నివేశాలు ఎక్కువగా ఉండనున్నాయి. భూతకోల నేపథ్యాన్ని ఇంకాస్త జోడించనున్నారు.

Updated Date - 2023-08-21T19:00:42+05:30 IST