K. Viswanath: శంకరాభరణం సృష్టికర్త ఇకలేరు!

ABN , First Publish Date - 2023-02-03T00:57:15+05:30 IST

తెలుగు చిత్ర పరిశ్రమకు అద్భుతమైన చిత్రాలను అందించిన దిగ్గజ దర్శకుడు కళాతపస్వీ కె. విశ్వనాథ్‌ కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

K. Viswanath: శంకరాభరణం సృష్టికర్త ఇకలేరు!

తెలుగు చిత్ర పరిశ్రమకు అద్భుతమైన చిత్రాలను అందించిన దిగ్గజ దర్శకుడు కళాతపస్వీ కె. విశ్వనాథ్‌ (K. Viswanath) కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన పూర్తిపేరు కాశీనాధుని విశ్వనాథ్‌.(K. Viswanath passed away) గుంటూరు జిల్లా రేపల్లె మండలం పెదపులివర్రు గ్రామం ఆయన స్వస్థలం. 1930 ఫిబ్రవరి 19న కాశీనాధుని సుబ్రహ్మణ్యం, సరస్వత్మ దంపతులకు విశ్వనాథ్‌ జన్మించారు. కె.విశ్వనాథ్‌కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. (RIp K. Viswanath)

మద్రాస్‌లోని ఒక స్టూడియో సౌండ్‌ రికార్డిస్టుగా సినీ జీవితాన్ని ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. పాతాళభైరవి చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశారు. ఆదుర్తి సుబ్బారావు దగ్గర మూగ మనసులు, డాక్టర్‌ చక్రవర్తి చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేశారు. సుడిగుండాలు చిత్రానికి స్ర్కీన్‌ప్లే అందించిన ఆయన ‘ఆత్మగౌరవం’ సినిమాతో మెగాఫోన్‌ పట్టి దర్శకుడిగా మారారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, రచయితగా, దర్శకుడిగా, ఆడియోగ్రాఫర్‌గా, స్ర్కీన్‌ప్లే రైటర్‌గా ఆయన పరిశ్రమకు ఎంతో సేవ చేశారు. 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి తెలుగు సినిమాకు గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చారు. ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కీలక పాత్రలు పోషించారు. శంకరాభరణం, సాగర సంగమం, శ్రుతిలయలు, స్వయంకృషి, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం, ఓ సీత కథ; జీవన జ్యోతి, శుభలేఖ, అపద్భాందవుడు లాంటి ఎన్నో గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగులోనే కాకుండా హిందీలో పదికి పైగా చిత్రాలను తెరకెక్కించారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటుడిగా కీలక పాత్రలు పోషించి మెప్పించారు. కలిసుందాం రా, ఠాగూర్‌, నరసింహనాయుడు, నువ్వులేక నేనులేను. లక్ష్మీనరసింహ, స్వరాభిషేకం వంటి చిత్రాలు నటుడిగా ఆయనకు ఎంతో గుర్తింపు తీసుకొచ్చాయి. హైపర్‌ తెలుగులో ఆయన నటించిన చివరి చిత్రం. (padma shri K. Viswanath)

చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలకుగానూ కేంద్ర ప్రభుత్వం ఆయన్ను దాదాసాహెబ్‌ ఫాల్కే, పద్మశ్రీ వంటి జాతీయ పురస్కారాలు వరించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శంకరాభరణం, జీవన జ్యోతి, శుభలేఖ, సాగర సంగమం, స్వాతిముత్యం, శ్రుతిలయలు, అపద్భాందవుడు, శుభసంకల్పం చిత్రాలకు పలు విభాగాల్లో నంది అవార్డులు అందుకున్నారు. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌ అందుకున్నారు కళాతపస్వీ. కె. విశ్వనాథ్‌ మరణంలో చిత్ర పరిశ్రమ దిగ్భాంతికి లోనైంది. సినీ ప్రముఖులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.

Updated Date - 2023-02-03T00:58:39+05:30 IST