Jr Ntr : అవార్డ్‌ అందుకోవడానికేనా?

ABN , First Publish Date - 2023-09-14T13:26:43+05:30 IST

జూనియర్‌ ఎన్టీఆర్‌ కలిసి కుటుంబ సభ్యులతో కలిసి నేడు దుబాయ్‌ పయనమయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోటు, వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. సెప్టెంబర్‌ 15, 16 తేదీల్లో దుబాయ్‌లో జరగనున్న సైమా అవార్డ్‌ వేడుకల్లో ఆయన పాల్గొనున్నారు.

Jr Ntr : అవార్డ్‌ అందుకోవడానికేనా?

జూనియర్‌ ఎన్టీఆర్‌ కలిసి కుటుంబ సభ్యులతో కలిసి నేడు దుబాయ్‌ పయనమయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోటు, వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. సెప్టెంబర్‌ 15, 16 తేదీల్లో దుబాయ్‌లో జరగనున్న సైమా అవార్డ్‌ వేడుకల్లో ఆయన పాల్గొనున్నారు. ‘సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌’ (సైమా) వేడుకను ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి ఘనంగా నిర్వహించనున్నారు. ఈసారి దుబాయ్‌ ఈ వేడుకకు వేదిక కానుంది. ఎన్టీఆర్‌తో పాటు యశ్‌, రిషబ్‌ శెట్టి, హీరోయిన్లు మృణాల్‌ ఠాకూర్‌, శ్రీలీల తదితరులు సైమాలో సందడి చేయనున్నారు. అలాగే ఈ సంవత్సరం సైమా అవార్డుల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ 11 కేటగిరిల్లో నామినేషన్స్‌ దక్కించుకుంది. ‘సీతారామం’ 10 కేటగీరిల్లో నామినేషన్స్‌ దక్కాయి. ‘కాంతార’, ‘కేజీయఫ్‌2’ సినిమాలకు 11 కేటగిరిల్లో నామినేషన్స్‌ దక్కాయి. తెలుగు నుంచి ఉత్తమ నటుడి విభాగంలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, నిఖిల్‌, సిద్దూ జొన్నలగడ్డ, దుల్కర్‌ సల్మాన్‌, అడివి శేష్‌ పోటీపడుతున్నారు.

ప్రస్తుతం తారక్‌ కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ చిత్రంతో బిజీగా ఉన్నారు. పాన్‌ ఇండియా సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. పోరాట సన్నివేశాల చిత్రీకరణ ఇటీవల పూర్తి చేశారు. హీరో ఎంట్రడక్షన్‌ సీన్స్‌ గైస్‌ బంప్స్‌ వచ్చేలా ఉంటాయని టాక్‌? ఇందులో తారక్‌కు అండర్‌ వాటర్‌ ఫైటింగ్‌ సీన్‌ ఉందన్న సంగతి తెలిసిందే. దీని కోసం ఎన్టీఆర్‌ ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటున్నారు.

Updated Date - 2023-09-14T13:26:43+05:30 IST