Jagapathi Babu: విమానంలో మొదటిసారి.. ఏం గుర్తొచిందంటే!

ABN , First Publish Date - 2023-08-19T20:47:27+05:30 IST

నటుడు జగపతి బాబు(Jagapathi Babu) ఈ మధ్యకాలంలో సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఆయనకు సంబంధించిన అప్‌డేట్‌లను నెటిజన్లతో షేర్‌ చేసుకుంటున్నారు. తాజాగా ఆయన ప్రయాణిస్తున్న విమానంలోని ఫొటో షేర్‌ చేసి ఆసక్తికర విషయాన్ని చెప్పారు.

Jagapathi Babu: విమానంలో మొదటిసారి..  ఏం గుర్తొచిందంటే!

నటుడు జగపతి బాబు(Jagapathi Babu) ఈ మధ్యకాలంలో సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఆయనకు సంబంధించిన అప్‌డేట్‌లను నెటిజన్లతో షేర్‌ చేసుకుంటున్నారు. తాజాగా ఆయన ప్రయాణిస్తున్న విమానంలోని ఫొటో షేర్‌ చేసి ఆసక్తికర విషయాన్ని చెప్పారు. విమానంలోకి మొదటి ప్రయాణికుడిగా మొదటిసారి ఎక్కానని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘నా జీవితంలో ఫస్ట్‌ టైం మొదటి ప్యాసింజర్‌గా విమానం ఎక్కాను. ఈ సందర్భంలో తివిక్రమ్‌ చెప్పిన డైలాగ్‌ గుర్తొచ్చింది. ‘విమానం ఎగురుతుంది.. నువ్వు కాదు. నువ్వు సీట్లో కూర్చుంటావు అంతే..’ తివిక్రమ్‌ చెప్పిన ఈ డైలాగ్‌ అంటే నాకు ఎంతో ఇష్టం. ఒకే డైలాగులో జీవితం మొత్తాన్ని చెప్పాడు’’ అని జగపతి బాబు ట్వీట్‌ చేశారు.

ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది. కొందరు సరదాగా జగపతిబాబును కామెంట్‌ చేస్తుంటే మరి కొందరు ఏ సినిమా షూటింగ్‌కు వెళ్తున్నారు అప్‌డేట్‌ ఇవ్వండి అని పోస్ట్‌లు పెడుతున్నారు. ఓ నెటిజన్‌ అయితే ‘ఎప్పుడూ అందరికంటే లాస్ట్‌ ఎక్కుతారా సర్‌’ అని కామెంట్‌ చేశారు. ప్రస్తుతం జగపతిబాబు వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్‌ ‘పుష్ప-2’లో(Pushpa2), ‘సలార్‌’లో (Salaar)ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. అలాగే మహేశ్‌ - త్రివిక్రమ్‌ కాంబోలో వస్తున్న ‘గుంటూరు కారం’లో కూడా ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.

Updated Date - 2023-08-19T20:47:44+05:30 IST