Guntur Karam : మీనాక్షితో ఆటాపాట.. త్వరలో పాట!

ABN , First Publish Date - 2023-12-03T13:00:16+05:30 IST

అతడు, ఖలేజా చిత్రాల తర్వాత హ్యాట్రిక్‌ కోసం ప్రయత్నం చేస్తున్నారు మహేష్ బాబు, త్రివిక్రమ్‌. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో 'గుంటూరు కారం’ చిత్రం రూపొందుతుంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. సంక్రాంతి కానుకగా జనవరి 12న 'గుంటూరు కారం' రుచి చూపించనున్నారు నిర్మాత ఎస్‌ రాధాకృష్ణ.

Guntur Karam : మీనాక్షితో ఆటాపాట.. త్వరలో పాట!

అతడు, ఖలేజా చిత్రాల తర్వాత హ్యాట్రిక్‌ కోసం ప్రయత్నం చేస్తున్నారు మహేష్ బాబు, త్రివిక్రమ్‌. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో 'గుంటూరు కారం’ చిత్రం రూపొందుతుంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. సంక్రాంతి కానుకగా జనవరి 12న 'గుంటూరు కారం' రుచి చూపించనున్నారు నిర్మాత ఎస్‌ రాధాకృష్ణ. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో మహేశ్‌, మీనాక్షిలపె ఓ పాటను తెరకెక్కిస్తున్నారు. ఈ వారంలోనే ఈ పాట పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. నెలాఖరుకి సినిమా మొత్తం పూర్తి కానుందట. ఇప్పటికే ఓ పాటను విడుదల చేశారు. త్వరలో రెండో పాటను విడుదల చేయనున్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇదని, మహేశ్‌ మునుపెన్నడూ చేయని మాస్‌ పాత్రలో కనిపించనున్నారు అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

ఇటీవల ఈ చిత్రంలో పాటల గురించి నిర్మాత ఆసక్తికర విషయాలు చెప్పారు. ''ఇప్పటికే ఒక పాట రిలీజ్‌ చేశాం. ఇంకా మూడు అద్భుతమైన పాటలున్నాయి. అవన్నీ ఎప్పటికీ గుర్తుండిపోయే పాటలే! పాటలు విడుదల చేయడానికి జనాలకు చేరడానికి ప్రస్తుతం మాకున్న టైమ్‌ కరెక్ట్‌గా సరిపోతుంది. రాబోయే మూడు పాటలు కూడా ట్రెండ్‌ సెట్టర్‌ పాటలుగా నిలుస్తాయి’’ అని నాగవంశీ అన్నారు. జగపతిబాబు, రమ్యకృష్ణ, ప్రకాశ్‌ రాజ్‌ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. తమన్‌ సంగీతమందిస్తుండగా.. మనోజ్‌ పరమహంస ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Updated Date - 2023-12-03T13:00:38+05:30 IST