Guntur Kaaram: మాస్‌ నంబర్‌.. ఇద్దరూ చితక్కొట్టేశారంతే! 

ABN , Publish Date - Dec 26 , 2023 | 10:10 AM

తెలుగువారి పెద్ద పండుగ అయిన సంక్రాంతికి 'గుంటూరు కారం’తో*(Guntur kaaram) సందడి చేయనున్నారు సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు(Mahesh babu). పండగ విందు అందించడానికి దమ్‌ మసాలా బిర్యానీ రెడీ చేస్తున్నారు.

Guntur Kaaram: మాస్‌ నంబర్‌.. ఇద్దరూ చితక్కొట్టేశారంతే! 

తెలుగువారి పెద్ద పండుగ అయిన సంక్రాంతికి 'గుంటూరు కారం’తో*(Guntur kaaram) సందడి చేయనున్నారు సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు(Mahesh babu). పండగ విందు అందించడానికి దమ్‌ మసాలా బిర్యానీ రెడీ చేస్తున్నారు. త్రివిక్రమ్‌ (Trivikram) దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'గుంటూరు కారం’. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. ఎస్‌.రాధాకృష్ణ నిర్మాత. ప్రస్తుతం సినిమా చివరి పాట చిత్రీకరణలో ఉంది. మహేశ్‌, శ్రీలీలపై చిత్రీకరిస్తున్న ఈ మాస్‌ గీతం నుంచి ఓ వర్కింగ్‌ స్టిల్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ మేరకు నిర్మాత నాగవంశీ ఓ ట్వీట్‌ చేశారు.

''జస్ట్‌ స్పైసీ మాస్‌ సాంగ్‌ విజువల్స్‌ చూశాను.సూపర్‌స్టార్‌ మహేశ్, శ్రీలీల ఇద్దరు చితక్కొట్టేశారంతే! ఈ స్పైసీ మాస్‌ నంబర్‌ థియేటర్లలో ప్రేక్షకుల్ని ఓ ఊపు ఊపేస్తుంది. మన మాస్‌ భాషలో చెప్పాలంటే  'ఆ.. కుర్చీ మడతపెట్టి...’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. నాగవంశీ ట్వీట్‌ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని కలిగించింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. త్రివిక్రమ్‌, మహేష్‌ కాంబోలో వస్తున్న మూడో చిత్రమిది. హారికా అండ్‌ హాసిని క్రియేషన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది

Updated Date - Dec 26 , 2023 | 10:10 AM