Ghattamaneni Adiseshagiri Rao: అందులో నా పాత్రేమీ లేదు.. ‘వంశీ’ సినిమా తీశానంతే!

ABN , First Publish Date - 2023-05-25T14:34:58+05:30 IST

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు గురించి ఆయన బాబాయ్‌ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. కృష్ణ నటించిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’ ఈ నెల 31న రీరిలీజ్‌ కాబోతున్న సందర్భంగా ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆది శేషగిరి రావు ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

Ghattamaneni Adiseshagiri Rao: అందులో నా పాత్రేమీ లేదు.. ‘వంశీ’ సినిమా తీశానంతే!

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు (Maheshbabu) గురించి ఆయన బాబాయ్‌ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు (Adisesha girirao) ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. కృష్ణ (Krishna) నటించిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’ (mosagallaku mosagadu) ఈ నెల 31న రీరిలీజ్‌ కాబోతున్న సందర్భంగా ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆది శేషగిరి రావు ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంలో ఆయన మహేశ్‌ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ‘‘మహేశ్‌బాబుతో నేను తీసింది ఒకే సినిమా. అదే వంశీ. ఆ చిత్రంలో నమ్రతను హీరోయిన్‌గా తీసుకున్నాం. తను నమ్రతను ప్రేమిస్తున్న విషయాన్ని ముందుగా తన తల్లి ఇందిరతో చెప్పాడు. ఆమె అన్నయ్యకు చెప్పింది. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు కాబట్టి పెళ్లి చేద్దాం అని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో నా పాత్ర ఏమీ లేదు. మహేశ్‌బాబు, నమ్రతలను పెట్టి వంశీ సినిమా తీశానంతే’’ అన్నారు.

చిన్నప్పటి నుంచీ మహేశ్‌ను దగ్గరగా చూశా. తను మంచి మిమిక్రీ ఆర్టిస్ట్‌ Mahesh Mimicry Artist). ఎవరినైనా ఇమిటేట్‌ చేస్తాడు. మహేశ్‌ స్టార్‌ అవుతాడని ముందే ఊహించా. అమితాబ్‌ బచ్చన్‌కు ఉన్నంత టాలెంట్‌ తనలో ఉంది. 14 ఏళ్ల వయసులో డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండానే కారు నడిపాడు. మద్రాస్‌లో పోలీసులు చూసి వెంటపడితే నేరుగా ఆఫీస్‌లోకి వచ్చి ఏమీ తెలియనట్లు వచ్చి కూర్చున్నాడు. నేనే పోలీసులతో మాట్లాడి పంపించేశాను’ అని ఆదిశేషగిరి రావు తెలిపారు.

ప్రస్తుతం మహేశ్‌ త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేస్తున్నారు. తదుపరి రాజమౌళితో ఎస్‌ఎస్‌ఎంబీ29 చిత్రం చేయబోతున్నారు. ఇటీవల వెకేషన్‌ కోసం స్పెయిన్‌ వెళ్లొచ్చిన మహేశ్‌ త్వరలో త్రివిక్రమ్‌ సినిమా సెట్‌లో అడుగు పెడతారని తెలుస్తోంది.

Updated Date - 2023-05-25T14:43:43+05:30 IST