Saindhav: వెంకటేష్‌ కోసం ఆ ముగ్గురు.. ఒకే వేదికపైకి! 

ABN , Publish Date - Dec 26 , 2023 | 06:01 PM

టాలీవుడ్‌ అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌.. నలుగురు కలిసి ఒకే వేదికపై కనిపించడం చాలా అరుదు. ఇద్దరు ఇద్దరు కనిపించడం జరుగుతుంది కానీ.. నలుగురు ఒకే వేదికపై కనిపించడం మాత్రం అంత సులభమైన పని కాదు.

 Saindhav: వెంకటేష్‌ కోసం ఆ ముగ్గురు.. ఒకే వేదికపైకి! 

టాలీవుడ్‌ అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌.. నలుగురు కలిసి ఒకే వేదికపై కనిపించడం చాలా అరుదు. ఇద్దరు ఇద్దరు కనిపించడం జరుగుతుంది కానీ.. నలుగురు ఒకే వేదికపై కనిపించడం మాత్రం అంత సులభమైన పని కాదు. అప్పుడెప్పుడో వజ్రోత్రవాల్లో ఈ నలుగురు హీరోలు కలిసి కనిపించారు. అయితే తాజాగా సమాచారం ప్రకారం ఈ నలుగురు ఒకే వేదికపై కనిపించనున్నారని తెలుస్తోంది. అందుకు వెంకటేష్‌ నటించిన సైంధవ్‌ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక వేదిక కానుంది. 

 

వెంకీ హీరోగా నటిస్తున్న 75వ చిత్రమిది. శైలేష్‌ కొలను దర్శకుడు. ఆ తరుణంలో వెంకటేష్‌ ప్రత్యేక వేడుక నిర్వహించాలని ప్లాన్  చేశారు. ఈ వేడుకకు చిరంజీవి బాలకృష్ణ, నాగార్జున హాజరు కాబోతున్నారట. వీరే కాకుండా వెంకటేష్‌ కుటుంబంతో అనుబంధం ఉండి, అందుబాటులో ఉన్న మరికొంతమంది యంగ్‌ హీరోలు కూడా హాజరు అయ్యే అవకాశం ఉందట. ఇదే కనుక నిజమైతే ఆయా హీరోల అభిమానులకు పండగే! బుధవారం సాయంత్రం ఈ కార్యక్రమం జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది


Updated Date - Dec 26 , 2023 | 06:01 PM