Multi-starrer: రానా దగ్గుబాటి, రాజశేఖర్ మల్టీ స్టారర్ సినిమా

ABN , First Publish Date - 2023-07-11T11:25:35+05:30 IST

టాలీవుడ్ లో ఇంకో మల్టీ స్టారర్ సినిమాకి దర్శకుడు తేజ ప్లేన్ చేస్తున్నారు. రానా దగ్గుబాటి తో 'రాక్షసరాజా' ప్రకటించిన తేజ, ఆ సినిమాలో సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్ ని కూడా ఇంకో కీలక పాత్రకి తీసుకుంటున్నట్టుగా తెలిసింది.

Multi-starrer: రానా దగ్గుబాటి, రాజశేఖర్ మల్టీ స్టారర్ సినిమా
Rana Daggubati and Dr Rajasekhar

దర్శకుడు తేజ (Director Teja), ప్రముఖ నిర్మాత సురేష్ బాబు (SureshBabu) రెండో కుమారుడు అభిరామ్ (AbhiramDaggubati) ని పరిచయం చేస్తూ తీసిన సినిమా 'అహింస' (Ahimsa) బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరంగా విఫలం అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తేజ, సురేష్ బాబు పెద్ద కుమారుడు, నటుడు రానా దగ్గుబాటి (RanaDaggubati) తో 'రాక్షస రాజు' #RakshasaRaju అనే సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.

directorteja2.jpg

అయితే ఇదిలా ఉంటే, ఈ సినిమాలో ఇంకో ప్రముఖ నటుడు కూడా వుంటారు అని తెలుస్తోంది. అది మరెవరో కాదు, డాక్టర్ రాజశేఖర్ (Dr Rajasekhar) అని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయకుడిగా రానా దగ్గుబాటి చేస్తుండగా, ఇంకొక కీలక పాత్రలో రాజశేఖర్ ని దర్శకుడు తేజ ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రాజశేఖర్ తో మాట్లాడారని, అతను కూడా సుముఖంగానే వున్నారని, రెండు మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం వుంది అని అంటున్నారు.

ఇది కనక ఫైనల్ అయితే, చాలా కాలం తరువాత రాజశేఖర్ ఇలా ఒక మల్టీ స్టారర్ సినిమాలో నటించటం అని అంటున్నారు. ఈ సినిమాలో రాజశేఖర్, రానా దగ్గుబాటి కి అన్నగా వేయొచ్చు అని కూడా అంటున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, ఒకసారి అవి పూర్తయ్యాక, సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారు అనే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు అని యూనిట్ సభ్యుడు ఒకరు చెప్పారు.

Updated Date - 2023-07-11T11:25:35+05:30 IST