Devara: ఆరో షెడ్యూల్‌తోపాటు మరో అదిరే అప్‌డేట్‌!

ABN , First Publish Date - 2023-07-17T13:57:37+05:30 IST

ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న ‘దేవర’ చిత్రం ఇటీవల ఐదో షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ శంషాబాద్‌లోని తాహెర్‌ ల్యాండ్‌ వేసిన భారీ సెట్‌లో జరిగిన సంగతి తెలిసిందే! తాజాగా అక్కడ హీరో ఎన్టీఆర్‌, సైఫ్‌ అలీఖాన్‌, షైన్‌ టామ్‌ చాకో తదితరులపై కీలక పోరాట ఘట్టాలను తెరకెక్కించారు. వాటితో అక్కడ షెడ్యూల్‌ పూర్తయింది. ఆరో షెడ్యూల్‌ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుందని ఇటీవల చిత్ర బృందం ప్రకటించింది.

Devara: ఆరో షెడ్యూల్‌తోపాటు మరో అదిరే అప్‌డేట్‌!

ఎన్టీఆర్‌ (Jr Ntr) హీరోగా నటిస్తున్న ‘దేవర’ (Devara) చిత్రం ఇటీవల ఐదో షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. కొరటాల శివ (Shiva koratala) తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ శంషాబాద్‌లోని తాహెర్‌ ల్యాండ్‌ వేసిన భారీ సెట్‌లో జరిగిన సంగతి తెలిసిందే! తాజాగా అక్కడ హీరో ఎన్టీఆర్‌, సైఫ్‌ అలీఖాన్‌, షైన్‌ టామ్‌ చాకో తదితరులపై కీలక పోరాట ఘట్టాలను తెరకెక్కించారు. వాటితో అక్కడ షెడ్యూల్‌ పూర్తయింది. ఆరో షెడ్యూల్‌ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుందని ఇటీవల చిత్ర బృందం ప్రకటించింది. దీనికోసం ఇప్పటికే ఓ ప్రత్యేక సెట్‌ను సిద్థం చేశారు. అయితే పలు కారణాల వల్ల తాజా షెడ్యూల్‌ 20వ తేదిన ప్రారంభం కానుందని ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ పేజీల్లో చక్కర్లు కొడుతోంది. ఆర్టిస్ట్‌ల డేట్స్‌ అడ్జస్ట్‌మెంట్‌ సమస్యతో 20వతేదికి షెడ్యూల్‌ వాయిదా పడిందని తెలిసింది. ఈ షెడ్యూల్‌లో కూడా యాక్షన్‌ సన్నివేశాలనే చిత్రీకరించనున్నారు. యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ సాల్మన్‌ నేతృత్వంలో ఈ షెడ్యూల్‌ జరగనుంది. దాంతోపాటు ఇందులో విలన్‌గా నటిస్తోన్న సైఫ్‌ అలీఖాన్‌ పాత్ర అత్యంత క్రూరంగా ఉంటుందని తెలుస్తోంది. విలన్‌ పాత్రే అంత పవర్‌ఫుల్‌గా ఉంటే మరి హీరో తారక్‌ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో ఊహించవచ్చు.

మాస్‌ యాక్షన్‌ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌ అదిరిపోతుందని చిత్రవర్గం చెబుతోంది. శంషాబాద్‌లో సాబు సిరిల్‌ నేతృత్వంలో వేసిన సముద్రం, షిప్‌యార్డ్‌ సెట్‌లో ఈ సన్నివేశాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే!

Allu arha.jpeg

అయితే ఈ చిత్రానికి సంబంధించిన మరోవార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ (allu arjun) కూతురు అల్లు అర్హ ఛైల్డ్‌ గెస్ట్‌గా (Allu arha) కనిపించనుందట. సినిమాలో కీలక సన్నివేశంలో అర్హ సందడి చేయనుందని న్యూస్‌ వైరల్‌ అవుతోంది. ‘శాకుంతలం’ చిత్రంతో అర్హ వెండితెరకు పరిచయమైన సంగతి తెలిసిందే! అందులో భరత పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే దేవర చిత్రం విషయంలో అర్హకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రఽశీదేవి కూతురు జాన్వీ కపూర్‌ కథానాయికగా రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిరుధ్‌ సంగీతం అందిస్తున్రాఉ. రత్నవేలు ఛాయగ్రాకుడిగా పని చేస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువసుధా ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జనతా గ్యారేజ్‌’ తర్వాత తారక్‌తో శివ కొరటాల చేస్తున్న చిత్రమిది. ‘ఆచార్య’ చిత్రం పరాజయంతో తనని తాను నిరూపించుకోవడానికి ఈ చిత్రం కోసంతో శ్రమిస్తున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2023-07-17T13:57:37+05:30 IST