Chiranjeevi: క్యూలో మరో ఇద్దరు.. అసలు తగ్గడం లేదుగా!

ABN , First Publish Date - 2023-04-20T10:03:30+05:30 IST

మెగాస్టార్‌ చిరంజీవి వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఓ పక్క ‘భోళాశంకర్‌’ చిత్రం షూటింగ్‌ చేస్తూనే కొత్త కథలపై దృష్టిసారిస్తూ యువ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు.

Chiranjeevi: క్యూలో మరో ఇద్దరు.. అసలు తగ్గడం లేదుగా!

మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఓ పక్క ‘భోళాశంకర్‌’ (Bhola Shankar) చిత్రం షూటింగ్‌ చేస్తూనే కొత్త కథలపై దృష్టిసారిస్తూ యువ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. ఇప్పుడు ఆయనతో సినిమా చేయడానికి యువ దర్శకులు నూతన ఉత్సాహం చూపిస్తున్నారు. కథలతో క్యూ కడుతున్నారు. ‘బింబిసారా’ ఫేం వశిష్ఠ (Vasishta) ఇప్పటికే ఓ కథతో చిరంజీవిని మెప్పించారని, ఆ కథ తుదిమెరుగుల్లో ఉందని టాక్‌ వినిపిస్తోంది. ఫాంటసీ కథతో కూడిన ఈ యాక్షన్‌ కథని యు.వి క్రియేషన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతుందని చిరు సన్నిహితుల నుంచి సమాచారం.

వశిష్ఠతోపాటు మరికొందరు కూడా చిరంజీవి కథలు వినిపించారని, ఇంకా కథలు చెప్పే ప్రాసెస్‌లో కొంతమంది ఉన్నారని టాక్‌. ఇందులో తమిళ దర్శకుడు పి.ఎస్‌.మిత్రన్‌ (P.S.Mithran)కూడా ఉన్నారు. చిరంజీవితో ఆయన ఓ సినిమా చేయబోతున్నట్లు వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. చిరంజీవి తనయ సుస్మిత కొణిదెల నిర్మాణంలో ఈ చిత్రం రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాజెక్ట్‌ విషయంలో ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఫేమ్‌ కురసాల కల్యాణ్‌కృష్ణ పేరు కూడా వినిపిస్తోంది. మరి చిరు ఎవర్ని ఫైనల్‌ చేస్తారో చూడాలి.

Untitled-1.jpg

ఈ ఏడాది ప్రారంభంలో ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) చిత్రంతో అలరించారు చిరంజీవి. సంక్రాంతి బరిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. కె.ఎస్‌.రవీంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ చిరంజీవికి సోదరుడిగా కనిపించారు. శ్రుతీహాసన్‌ కథానాయిక.

Updated Date - 2023-04-20T10:06:07+05:30 IST