Adipurush: ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తిరుపతిలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

ABN , First Publish Date - 2023-06-05T13:20:56+05:30 IST

ఆదిపురుష్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ డేట్‌ ఫిక్స్‌ అయినప్పటి నుంచీ సోషల్‌ మీడియాలో ఈ చిత్రం గురించే చర్చ జరుగుతోంది. తొలుత విడుదలైన టీజర్‌తో పూర్తి నెగటివ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం ట్రైలర్‌, శ్రీరామ్‌ పాట విడుదల కాగానే సినిమాపై బజ్‌ పెరిగింది. ఆదిపురుష్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు చినజీయర్‌ స్వామి అతిథిగా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ట్వీట్‌ చేసింది.

Adipurush: ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తిరుపతిలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

'ఆదిపురుష్‌’ (Adipurush)ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ డేట్‌ ఫిక్స్‌ అయినప్పటి నుంచీ సోషల్‌ మీడియాలో ఈ చిత్రం గురించే చర్చ జరుగుతోంది. తొలుత విడుదలైన టీజర్‌తో పూర్తి నెగటివ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం ట్రైలర్‌, శ్రీరామ్‌ పాట విడుదల కాగానే సినిమాపై బజ్‌ పెరిగింది. ఇప్పుడు సోషల్‌ మీడియా మొత్తం ఈ సినిమా పోస్టర్‌లతోనే హల్‌చల్‌ చేస్తోంది. ప్యాన్‌ ఇండియా స్టార్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఆరో తేదిన తిరుపతిలో (Pre release in Tirupati) గ్రాండ్‌గా నిర్వహించడానికి నిర్మాణ సంస్థ గ్రాండ్‌ నిర్వహించనున్నారు. ప్రభాస్‌ సినిమా కావడంతో ఈవెంట్‌కు మరింత గ్రాండియర్‌ తీసుకురావడానికి ముఖ్య అతిథిగా ఎవరు హాజరవుతున్నారు అంటూ అభిమానుల్లో ఆసక్తి పెంచుతూ రెండ్రోజులుగా చిత్ర బృందం ఆసక్తికర పోస్ట్‌లు చేసింది. ఆ అతిథి ఎవరో తెలియజేస్తూ నిర్మాణ సంస్థ ట్వీట్‌ చేసింది. మంగళవారం తిరుపతిలో జరగనున్న ఆదిపురుష్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు చినజీయర్‌ స్వామి అతిథిగా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ట్వీట్‌ చేసింది. (Chinna Jeeyar Swami )

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వేదికగా జరగనున్న ఈ కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు చేశారు. ప్రభాస్‌ (Prabhas) అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొనున్నారు. వేదికపైకి ప్రభాస్‌ ఎంట్రీ ప్రత్యేకంగా ప్లాన్‌ చేశారని తెలుస్తోంది. రామాయణం ఇతివృత్తంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా, కృతీసనన్‌ జానకిగా, లంకేశ్‌గా సైఫ్‌ అలీఖాన్‌ నటించారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఈ వేడుక జరగనుందని తెలుస్తోంది. అందుకే చినజీయర్‌స్వామిని ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ వేడుకలో దాదాపు 200 మంది సింగర్స్‌, 200 మంది డ్యాన్సర్లు ప్రదర్శన ఇవ్వనున్నారు. ఓంరౌత్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ సినిమాకు సంగీతం అందించిన సంగీత దర్శకుల్లో ఒకరైన అతుల్‌ ముంబయి నుంచి తిరుపతికి బైక్‌పై రానున్నారు.

Updated Date - 2023-06-05T13:20:56+05:30 IST