Naga Chaitanya: డైరెక్టర్, హీరోయిన్ కన్ఫర్మ్ అయ్యారు, త్వరలో షూటింగ్

ABN , First Publish Date - 2023-07-17T10:41:51+05:30 IST

నాగ చైతన్య, దర్శకుడు చందూ మొండేటి మరోసారి కలిసి పనిచేయనున్నారు. ముచ్చటగా మూడో సారి చేస్తున్న ఈ సినిమా గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్నారని, ఇందులో కీర్తి సురేష్ కథానాయకురాలని తెలిసింది.

Naga Chaitanya: డైరెక్టర్, హీరోయిన్ కన్ఫర్మ్ అయ్యారు, త్వరలో షూటింగ్
Naga Chaitanya

'కస్టడీ' #Custody, 'థేంక్ యు' #ThankYou సినిమాలు ఫ్లాప్ అవటంతో నాగ చైతన్య (NagaChaitanya) ఈసారి మంచి కథ వున్న సినిమా చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అందుకు ఎవరు సరిపోతారా అని అనుకుంటున్న సమయంలో దర్శకుడు చందు మొండేటి (ChandooMondeti) ఒక లైన్ చెప్పగానే అది విని ఈ సినిమా చేద్దాం అని చెప్పాడు అని తెలిసింది. ఈ సినిమాని గీత ఆర్ట్స్ 2 (GeethaArts) బ్యానర్ లో బన్నీ వాసు (BunnyVas) ప్రొడ్యూస్ చేస్తున్నట్టుగా కూడా తెలిసింది. అయితే ఈ కథని చందు ఒక నిజ సంఘటన (TrueIncident) ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టుగా తెలిసింది.

nagachaitanya1.jpg

ఇంతకీ ఇందులో కథానాయకురాలు ఎవరో తెలుసా, ఇప్పుడు తెలుగు, తమిళంలో మంచి ఫామ్ లో వున్న కీర్తి సురేష్ (KeerthySuresh). నాగ చైతన్య, కీర్తి సురేష్ 'మహానటి' #Mahanati సినిమాలో ఒకటి రెండు సన్నివేశాల్లో కలిపి నటించారు. నాగ చైతన్య అందులో తన తాత అక్కినేని నాగేశ్వర రావు (AkkineniNageswaraRao) పాత్ర వేస్తె, కీర్తి సురేష్ మహానటి సావిత్రి #Savitri పాత్ర వేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా కీర్తి సురేష్ కి పేరు ప్రఖ్యాతులతో పాటు, అవార్డులను కూడా గెలుచుకుంది.

keerthysuresh2.jpg

ఇప్పుడు ఈ ఇద్దరూ చందు మొండేటి సినిమాకి లీడ్ పెయిర్ గా పని చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే మొదలవుతుందని తెలుస్తోంది. ఇంతకు ముందు చందు నాగచైతన్య తో 'ప్రేమమ్' #Premam, 'సవ్యసాచి' #Savyasachi రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇప్పుడు ఇది మూడో సినిమా అవుతుంది, ఈ ఇద్దరికీ వైబ్రేషన్ కూడా బాగుండటంతో ఈ సినిమా బాగా వస్తుందని అనుకుంటున్నారు. అల్లు అర్జున్ (AlluArjun) తో సినిమా చేసే ముందు, చందు మొండేటి, నాగ చైతన్య తో ఈ సినిమా పూర్తి చేయనున్నట్టుగా తెలిసింది.

Updated Date - 2023-07-17T10:42:41+05:30 IST