BiggBoss Eliminations : . ఇలాంటి ఝలక్‌ ఇచ్చాడేంటి?

ABN , First Publish Date - 2023-10-08T23:48:10+05:30 IST

బిగ్‌బాస్‌ 7 (biggboss7) ‘ఉల్టా పల్టా’ సీజన్‌ ఐదు వారాలు పూర్తి చేసుకుంది. ఐదో వారం ఎలిమినేషన్‌ పూర్తయింది. అయితే బిగ్‌బాస్‌ ఊహించని ట్విస్ట్‌ ఇచ్చాడు. హౌస్‌ నుంచి శుభశ్రీ (Shubhasri ) రాయ్‌గురు, గౌతమ్‌ కృష్ణ (Goutham krishna) ఎలిమినేట్‌ అయ్యారు.

BiggBoss Eliminations : . ఇలాంటి ఝలక్‌ ఇచ్చాడేంటి?

బిగ్‌బాస్‌ 7 (biggboss7) ‘ఉల్టా పల్టా’ సీజన్‌ ఐదు వారాలు పూర్తి చేసుకుంది. ఐదో వారం ఎలిమినేషన్‌ పూర్తయింది. అయితే బిగ్‌బాస్‌ ఊహించని ట్విస్ట్‌ ఇచ్చాడు. హౌస్‌ నుంచి శుభశ్రీ (Shubhasri ) రాయ్‌గురు, గౌతమ్‌ కృష్ణ (Goutham krishna) ఎలిమినేట్‌ అయ్యారు. కానీ, గౌతమ్‌ కృష్ణను బిగ్‌బాస్‌ సీక్రెట్‌ రూమ్‌లో పెట్టడం గమనార్హం. ప్రేక్షకుల నుంచి అతి తక్కువ ఓట్లు వచ్చిన చివరి ముగ్గురు కంటెస్టెంట్‌లుగా శుభశ్రీ, తౌమ్‌, తేజ నిలిచారు. వీరిలో తొలుత శుభశ్రీని ఎలిమినేట్‌ చేసినట్లు నాగార్జున ప్రకటించారు. అతి తక్కువ ఓట్లు వచ్చిన ఐదో కంటెస్టెంట్‌గా ఆమె ఎలిమినేట్‌ అయినట్లు నాగ్‌ తెలిపారు. ఈ వారం నామినేషన్స్‌లో టేస్టీ తేజ, శివాజీ, శుభశ్రీ, గౌతమ్‌ కృష్ణ, ప్రిన్స్‌ యావర్‌, ప్రియాంక, అమర్‌దీప్‌లు ఉండగా, అందరినీ డార్క్‌ రూమ్‌లోకి పంపి ఎలిమినేట్‌ అయినవాళ్లు బయటకు వస్తారని నాగార్జున తెలిపారు. అతి తక్కువ ఓట్లు రావడంతోపాటు, హౌస్‌లో ఉండేందుకు అర్హతలేని చివరి ముగ్గురు కంటెస్టెంట్‌లలో శుభశ్రీ ఉండటంతో ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున చెప్పారు.

Shubhashree-Rayguru.jpg

బయటకు వచ్చిన శుభశ్రీ సరదాగా మాట్లాడింది. బిగ్‌బాస్‌ హౌస్‌ను ఎంతో మిస్‌ అవుతున్నానని చెప్పింది. ప్రియాంకతో కలిసి పాటలు పాడటం, స్విమ్మింగ్‌ చేయడం మంచి అనుభూతి అని చెప్పింది. తేజ చాలా జోక్‌లు చెప్పేవాడని, తనని ఎంతో నవ్వించేవాడని చెప్పుకొచ్చింది. ఇంకా మాట్లాడుతూ ‘‘శివాజీ నుంచి ఎంతో నేర్చుకున్నాను. బయటకు వచ్చాక తప్పకుండా కలుస్తాను. గౌతమ్‌తో చాలా సంతోషకరమైన సందర్భాలు ఉన్నాయి. నన్ను ఎంతతో ఫ్లర్ట్‌ చేసేవాడు. అతను ఉప్మా చేస్తే నేను పోపు వేసేదాన్ని. సందీప్‌ మాస్టర్‌తో ఉదయం డ్యాన్స్‌ చేయడం ఎంతో ఆనందంగా ఉండేదని తెలిపింది. శుభశ్రీ.. యాలకులు తినేటప్పుడు చేసే స్టైల్‌ ఎప్పటికీ గుర్తుంఇపోతుందని చెప్పింది. టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులు రాసిన లెటర్‌ని శుభశ్రీ త్యాగం చేయగా, నాగార్జున తిరిగి దాన్ని ఆమెకు ఇచ్చారు.

goutham krishna.jpg

గౌతమ్‌ ఎలిమినేషన్‌ ఎలా అంటే...

ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌ జరిగింది. రెండో వ్యక్తిగా గౌతమ్‌ కృష్ణ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అతి తక్కువ ఓటింగ్‌ ఉన్న వారిలో శుభశ్రీ బయటకు వెళ్లగా గౌతమ్‌, టేస్టీ తేజ మిగిలారు. కానీ హౌస్‌లో ఉన్న ఎనిమిది మందిలో ఆరుగురు టేస్టీ తేజను సపోర్ట్‌ చేస్తూ ఓటు వేశారు. దీంతో గౌతమ్‌ ఇంటి నుంచి ఎలిమినేట్‌ అయ్యాడు.

గౌతమ్‌ మాట్లాడుతూ ‘‘ఈ ఎలిమినేషన్‌ అసలు ఊహించలేదు. ఇచ్చిన టాస్క్‌లు బాగానే ఆడాను. వఫఇరేక ఓటింగ్‌ పడడం అంటే హౌస్‌మేట్స్‌ ేసఫ్‌ గేమ్‌ ఆడాలనుకున్నారని ఇప్పుడు అర్థమైంది’’ అన్నాడు.

హౌస్‌లో రియల్‌ ఎవరు? ఫేక్‌ ఎవరు అన్న నాగార్జున ప్రశ్నకు గౌతమ్‌ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిలో మరో యాంగిల్‌ ఉందని చెప్పాడు.

రియల్‌ – ఫేక్‌..

ప్రియాంకను చెల్లెమ్మ అని పిలుస్తా. అమర్‌, సందీప్‌, శోభాలతో పోలిేస్త నువ్వు కాస్త అమాయకురాలివి. కానీ, ఆట విషయంలో నీ ఆట గురించే ఆలోచించు.

తేజ ఫేక్‌ కాదు. ఉన్నవాళ్లలో నిజాయతీ కలిగిన వ్యక్తి. ఎంటర్‌టైన్‌ చేస్తూ ఉండు.. ఏ గ్రూప్‌ దగ్గరకీ వెళ్లకు. టాస్క్‌ బాగా ఆడు.

శోభాశెట్టి అందరితోనూ ఇరిటేట్‌గా ఉంటుంది మాట్లాడాలంటేనే భయపడతారు. ఇక్కడ అందరూ వ్యక్తిగతంగా ఆడతారు. నువ్వూ అలాగే ఆడాలి.

యావర్‌ శారీరకంగా చాలా స్ర్టాంగ్‌. నేను తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించు. ఫేక్‌గా ఉండే సామర్థ్యం లేదు. గేమ్‌లో ఓడిపోతే దానిని మనసు దాకా తీసుకోకు.

శివాజీలో ఫేక్‌గా అనిపిస్తారు. ఆయనకు నచ్చిన వ్యక్తులకు ఓటు వేస్తారు.

సందీప్‌, ప్రియాంక, శోభాశెట్టి అమర్‌ కలిసి ఆడతారు. వాళ్ల వాళ్లనే ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటారు.

సందీప్‌ సంచాలక్‌గా ఉన్నప్పుడు ఒకవైపు మాత్రమే స్టాండ్‌ తీసుకుంటాడు. కొన్ని సందర్భాల్లో ఫేక్‌గా అనిపిస్తాడు.

ప్రశాంత్‌ సేఫ్‌ గేమ్‌ ఆడాడు. శివాజీ ఏది ఆడితే, అదే ఆడతాడు

Updated Date - 2023-10-08T23:53:40+05:30 IST