Bhola Shankar : ఇప్పుడు బుల్లితెర వీక్షకుల కోసం...

ABN , First Publish Date - 2023-09-10T13:05:40+05:30 IST

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘భోళా శంకర్‌’. మెహర్‌ రమేశ్‌ దర్శకుడు. తమన్నా కథానాయిక. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పరాజయాన్ని చవి చూసింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలో స్ర్టీమింగ్‌ కానుంది.

Bhola Shankar : ఇప్పుడు బుల్లితెర వీక్షకుల కోసం...

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘భోళా శంకర్‌’ (Bhola Shankar). మెహర్‌ రమేశ్‌ (Meher Ramesh) దర్శకుడు. సిస్టర్‌ సెంటిమెంట్‌, మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో చిరంజీవి సోదరిగా కీర్తి సురేశ్‌ (Keerthy suresh) నటించారు. తమన్నా (Tamannah) కథానాయిక. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పరాజయాన్ని చవి చూసింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలో స్ర్టీమింగ్‌ కానుంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా సెప్టెంబర్‌ 15 నుంచి ఇది సినీ ప్రియులకు అందుబాటులో ఉండనుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. ఎ.కు. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రాంబ్రహ్మం సుంకర నిర్మించారు.

కథ:

తన చెల్లె (కీర్తిసురేశ్‌) చదువు కోసం శంకర్‌ (చిరంజీవి) కలకత్తా వెళ్తాడు. ఆమెను ఓ కాలేజీలో చేర్పించి.. తాను టాక్సీ డ్రైవర్‌గా జీవితాన్ని మొదలుపెడతాడు. మహాలక్ష్మిని చూసి శ్రీకర్‌ (సుశాంత్‌) ప్రేమలో పడతాడు. ఆ ఇద్దరికీ పెళ్లి చేయాలనే ప్రయత్నాల్లో ఉంటూనే, మానవ అక్రమ రవాణాకి పాల్పడుతున్న అలెగ్జాండర్‌ (తరుణ్‌ అరోరా) సోదరుల్లో ఒక్కొక్కరినీ అంతం చేయడం మొదలు పెడతాడు శంకర్‌. ఆ విషయాన్ని కళ్లారా చూస్తుంది శ్రీకర్‌ సోదరి, క్రిమినల్‌ లాయర్‌ లాస్య (తమన్నా). ఆ తర్వాత ఏం జరిగీంది? మానవ అక్రమ రవాణా ముఠాతో శంకర్‌కి ఉన్న వైరం ఏమిటి? తర్వాత ఏం జరిగింది అన్నది కథ.

Updated Date - 2023-09-10T15:21:10+05:30 IST