Balagam Emotions: ‘బలగం’ చూసి.. ఆ అన్నదమ్ములు ఏం చేశారంటే..!

ABN , First Publish Date - 2023-04-03T14:38:07+05:30 IST

కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా ‘బలగం’ చిత్రం ప్రస్తావనే! ‘జబర్దస్త్‌ వేణు దర్శకత్వంలో చిన్న సినిమాగా రూపొందిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల మనసును గెలుచుకుంది.

Balagam Emotions: ‘బలగం’ చూసి.. ఆ అన్నదమ్ములు ఏం చేశారంటే..!

కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా ‘బలగం’(Balagam) చిత్రం ప్రస్తావనే! ‘జబర్దస్త్‌ వేణు (Venu) దర్శకత్వంలో చిన్న సినిమాగా రూపొందిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల మనసును గెలుచుకుంది. కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టించడమే కాకుండా నాలుగు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. అంతే కాదు సినిమాలో బంధం, భావోద్వేగాలు తగాదాలతో దూరమైన వారిని సైతం దగ్గర చేస్తున్నాయి. ఈ చిత్రం అంతగా ప్రేక్షకులపై ప్రభావం చూపింది. తాజా సమాచారం ప్రకారం తగాదాలతో విడిపోయిన ఇద్దరు అన్నదమ్ములను ‘బలగం’ చిత్రం కలిపింది. ఈ ఘటన నిర్మల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. (Balagam Emotions Workouts)

నిర్మల్‌ జిల్లా లక్ష్మణ చాందకు చెందిన అన్నదమ్ములు గుర్రం పోసులు, రవి ఓ స్థలం వివాదంలో గొడవపడి చాలాకాలం క్రితం విడిపోయారు. ఇటీవల ఆ గ్రామ సర్పంచ్‌ సురకంటి ముత్యంరెడ్డి చొరవతో మండల కేంద్రంలోని డీఎన్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో ‘బలగం’ సినిమాను ఉచితంగా ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని చూసిన పోసులు, రవి తమ మనసును మార్చుకున్నారు. ఇద్దరి మధ్య ఉన్న వివాదాన్ని, మనస్పర్థలను పక్కనపెట్టి ఇకపై కలిసే ఉంటామని చెప్పారు. ఆదివారం ఉదయం సర్పంచ్‌ ముత్యంరెడ్డి సమక్షంలో ఈ అన్నదమ్ములిద్దరు ఒక్కటయ్యారు. వివాదంలో ఉన్న భూమి సమస్యను పరిష్కరించుకున్నారు. అన్నదమ్ముల్లో మార్పు రావడం చూసి గ్రామ సర్పంచ్‌ బలగం సినిమా చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

Updated Date - 2023-04-03T15:17:10+05:30 IST