Prabhas: అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ఠాపనకు ప్రత్యేక ఆహ్వానం

ABN , Publish Date - Dec 26 , 2023 | 10:15 AM

వందల ఏళ్లగా ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయం (Ayodhya ramalayam) ప్రతిష్ఠాపనకు సిద్ధమైంది. జనవరి 22న శ్రీరామచంద్రుడు (Sri ram) మందిరంలో కొలువుదీరనున్నాడు.

Prabhas: అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ఠాపనకు ప్రత్యేక ఆహ్వానం

వందల ఏళ్లగా ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయం (Ayodhya ramalayam) ప్రతిష్ఠాపనకు సిద్ధమైంది. జనవరి 22న శ్రీరామచంద్రుడు (Sri ram) మందిరంలో కొలువుదీరనున్నాడు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే చాలా మందికి ఆహ్వానాలు అందాయి. టాలీవుడ్‌లో మొదట మెగాస్టార్‌ చిరంజీవికి (Chiranjeevi) ఆహ్వానం అందిందని తెలిసింది. తదుపరి పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌కు(Prabhas) ఆహ్వానం అందింది. ఆయనతోపాటు బాలీవుడ్‌ నుంచి రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియాభట్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, సన్నీ దేవోల్‌, యశ్‌ సహా పలువురు సినీ ప్రముఖులకు ఆహ్వానం అందినట్లు నిర్మాత మహావీర్‌ సన్నిహిత వర్గాలు తెలిపాయి. రామాయణం  ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్‌ చిత్రంలో ప్రభాస్‌ శ్రీరాముడి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే! 


Updated Date - Dec 26 , 2023 | 01:32 PM