RRR- Oscar: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కు కేంద్రమంత్రి తేనీటి విందు!

ABN , First Publish Date - 2023-04-21T16:55:48+05:30 IST

ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్ర బృందాన్ని కేంద్రమంత్రి అమిత్‌ షా (Amit Shah to meet RRR Team) సన్మానించనున్నారు.

RRR- Oscar: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కు కేంద్రమంత్రి తేనీటి విందు!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్ర బృందాన్ని కేంద్రమంత్రి అమిత్‌ షా (Amit Shah to meet RRR Team) సన్మానించనున్నారు. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ‘నాటు నాటు’ పాటకు అంతర్ఝాతీయ వేదికపై ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ (Oscar 95) పురస్కారాన్ని అందుకున్న టీమ్‌కు ఆదివారం తేనీటి విందు ఇవ్వనున్నారు. చేవెళ్లలో జరగనున్న బహిరంగ సభకు హాజరు కానున్న అమిత్‌ షా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బృందంతో భేటీ కానున్నారు. 40 నిమిషాలు టీమ్‌ అందరితో గడపనున్నారు. అనంతరం తెలంగాణ బీజేపీ నేతలతో గంటపాటు సమావేశమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. (Ram charan-NTr)

1.jpg

రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ హీరోలుగా నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. రూ.500 కోట్లకు పైగా బడ్జెట్‌తో డి.వి.వి.దానయ్య నిర్మించిన ఈ చిత్రం రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతే కాదు అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు అందుకుంది. గోల్డెన్‌ గ్లోబ్‌, క్రిటిక్‌ ఛాయిస్‌ అవార్డులతో ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ను కూడా అందుకొంది. ఆస్కార్‌ వేడుక అనంతరం భారత్‌కు చేరుకున్న రామ్‌చరణ్‌ అమిత్‌షాను కలిశారు. రామ్‌చరణ్‌ను ఆయన శాలువాతో సత్కరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాజమౌళి, ఎన్టీఆర్‌ తదితర చిత్ర బృందాన్ని హైదరాబాద్‌ వేదికగా షా సన్మానించనున్నారు.

Updated Date - 2023-04-21T17:20:46+05:30 IST