Allu Arjun : కాంబినేషన్‌ రిపీట్‌.. ఖరారు చేసిన నిర్మాత!

ABN , First Publish Date - 2023-05-25T15:50:41+05:30 IST

పుష్ప-2’ తర్వాత అల్లు అర్జున్‌ సినిమా ఎవరితో? ప్రస్తుతం వైరల్‌ అవుతున్న టాపిక్‌ ఇది. ‘సరైనోడు’తో బ్లాక్‌ బస్టర్‌ ఇచ్చిన బోయపాటి ఓ సినిమా ఉంటుందని చాలాకాలంగా వార్తలొస్తున్నారు.

Allu Arjun : కాంబినేషన్‌ రిపీట్‌.. ఖరారు చేసిన నిర్మాత!

‘పుష్ప-2’ తర్వాత అల్లు అర్జున్‌ సినిమా ఎవరితో? ప్రస్తుతం వైరల్‌ అవుతున్న టాపిక్‌ ఇది. ‘సరైనోడు’తో బ్లాక్‌ బస్టర్‌ ఇచ్చిన బోయపాటి ఓ సినిమా ఉంటుందని చాలాకాలంగా వార్తలొస్తున్నారు. అలాగే ‘జులాయి’, సన్నాఫ్‌ సత్యమూర్తి’, అల వైకుంఠపురములో’ చిత్రాలతో హ్యాట్రిక్‌ విజయాన్ని అందించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఓ సినిమా ఉంటుందనే వార్తలు కూడా హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ‘పుష్ప-2’ తర్వాత బన్నీ నటించేది త్రివిక్రమ్‌ దర్శకత్వంలోనే అని నెట్టింట వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇదే విషయాన్ని నిర్మాత బన్నీ వాసు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది త్రివిక్రమ్‌ దర్శకత్వంలో బన్నీ చిత్రం ఉంటుందని వెల్లడించారు. ఇటీవల జరిగిన ‘2018’ చిత్రం ప్రీమియర్‌ షో అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బన్ని వాస్‌ ఈ అల్లు అర్జున్‌ - త్రివిక్రమ్‌ కాంబోలో రాబోయే చిత్రం గురించి తెలిపారు. ఈ కలయికలొ వచ్చే నాలుగో చిత్రమిది. వచ్చే ఏడాది ఈ సినిమా పట్టాలెక్కబోతోందని చెప్పారు. బన్నీ, త్రివిక్రమ్‌ల గత చిత్రం ‘అల వైకుంఠపురములో’ సినిమాను గీతా ఆర్ట్స్‌, హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పుడు వీరిద్దరి కలయికలో రానున్న ఈ చిత్రాన్ని ఇవే నిర్మాణ సంస్థలు నిర్మించబోతున్నాయని తెలిసింది. మరీ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కాలంటే కాస్త సమయం పట్టక తప్పదు. బన్నీ ఓ పక్క పుష్ప-2తో బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్‌ మహేశ్‌ సినిమాతో కుస్తీలు పడుతున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ నత్త నడకన సాగుతోంది. ఈ రెండు పూర్తయ్యాక కానీ త్రివిక్రమ్‌ - బన్నీల నాలుగో చిత్రానికి లైన్‌ క్లియర్‌ కాదు.

1.jpg

Updated Date - 2023-05-25T15:50:41+05:30 IST