కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Allu Arjun: అవార్డు అందుకోవటానికి సతీసమేతంగా వెళుతున్న అర్జున్

ABN, First Publish Date - 2023-10-16T15:06:49+05:30

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేక రోజుగా రేపు అంటే అక్టోబర్ 17 ఉంటుంది. ఉత్తమ నటుడిగా మొదటి సారి ఒక తెలుగు నటుడు జాతీయ అవార్డు గెలుగుచుకున్న అల్లు అర్జున్ రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి అవార్డు అందుకోనున్నారు. అందుకోసం ఈరోజు సతీ సమేతంగా ఢిల్లీ పయనం అయ్యారు అల్లు అర్జున్.

Allu Arjun along with his wife Sneha at the Hyderabad airport

అల్లు అర్జున్ (AlluArjun) ఈ సంవత్సరం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక సంచలనం సృష్టించారు. అతని సినిమా 'పుష్ప' #Pushpa చాలా పెద్ద ఘన విజయం అవటంతో పాటు, ఆ సినిమాలో చేసిన పుష్ప రాజ్ #PushpaRaj పాత్రకి గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే.

ఇలా ఒక తెలుగు నటుడికి జాతీయ అవార్డు పురస్కారం రావటం ఇదే మొదటిసారి. ఇంతకు ముందు కొంతమంది నటీమణులకు వచ్చాయి కానీ, మొదటిసారిగా ఒక తెలుగు నటుడికి రావటం జాతీయ అవార్డులు పెట్టినప్పటినుంచీ ఇదే మొదటిసారి. #NationalFilmAwards2023

అలా ఉత్తమ నటుడిగా గెలుగుచుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు చరిత్ర సృష్టించారు. #NationalFilmAwards ఢిల్లీ లో ఈ అవార్డుల వేడుక రేపు అంటే అక్టోబర్ 17న జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (DroupadiMurmu) ఈ అవార్డులను గెలుగుచుకున్న వారందరికీ రేపు బహుకరిస్తారు. ఆ అవార్డు అందుకోవటం కోసం అల్లు అర్జున్ తన సతీమణి స్నేహ రెడ్డి (SnehaReddy) తో కలిసి ఢిల్లీ వెళుతున్నారు.

హైదరాబాద్ ఎయిర్ పోర్టులో అల్లు అర్జున్, అయన సతీమణి స్నేహ రెడ్డి ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప 2' రెండో పార్టు వచ్చే సంవత్సరం ఆగస్టు 15న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. దీనికి సుకుమార్ (Sukumar) దర్శకుడు కాగా, ఇందులో రష్మిక మందన్న (RashmikaMandanna) కథానాయికగా నటిస్తోంది. మలయాళం నటుడు ఫహద్ ఫాజిల్ (FahadhFaasil) కూడా ఒక ముఖ్య పాత్రలో కనపడతారు.

Updated Date - 2023-10-16T15:06:49+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!