AlluAravind: పరశురామ్ మీద సెటైర్ వేసిన అల్లు అరవింద్

ABN , First Publish Date - 2023-06-01T13:24:52+05:30 IST

అల్లు అరవింద్ ఈరోజు '2018' సినిమా గురించి, అలాగే తమతో చెయ్యబోయే దర్శకుల గురించి మాట్లాడుతూ, పరోక్షంగా దర్శకుడు పరశురామ్ కి ఒక చిన్న చురకలాంటిది వేశారు.

AlluAravind: పరశురామ్ మీద సెటైర్ వేసిన అల్లు అరవింద్
Allu Aravind

అగ్ర నిర్మాత అల్లు అరవింద్ (AlluAravind) '2018' #2018Movie సినిమా సక్సెస్ గురించి, అది ఎందుకు అందరూ చూడాల్సిందో అని వివరించడానికి ఈరోజు మీడియా వాళ్ళతో మాట్లాడేరు. నిన్ననే అమెరికా నుండి వచ్చి రాత్రి ఈ '2018' సినిమా చూసి, ఈరోజు ఈ సినిమా గురించి మాట్లాడాలని వచ్చారు. ఈ సినిమా పరిశ్రమలో వాళ్ళు కూడా చూడాలని, థియేటర్ లో నే చూడాలని చెప్పారు. ఇందులో కేవలం ఎమోషన్ మాత్రమే ఉందని, ఒక కమెర్షియల్ సినిమాకి కావాల్సిన హంగులు ఏమీ లేకపోయినా ఈ సినిమా పెద్ద హిట్ అయిందని చెప్పారు.

అదే సమయం లో పక్కనే వున్న దర్శకుడు చందు మొండేటి (ChanduMondeti) గురించి చెపుతూ, చందూ మొండేటి మూడు సినిమాలు తమ గీత ఆర్ట్స్ (GeethaArts) లో చేస్తున్నాడని చెప్పారు. 'కార్తికేయ 2' #Karthikeya2 విడుదల కాకముందే చందు మొండేటి గొప్ప దర్శకుడు అని గుర్తించి అతనికి మా గీత ఆర్ట్స్ లో సినిమా చెయ్యమని చెప్పడం జరిగిందని చెప్పారు అల్లు అరవింద్.

chandoomondeti.jpg

అతని సినిమా విడుదల అయి సుమారు ఒక సంవత్సరం అవుతోందని, అదీ కాకుండా ఈమధ్య కాలంలో చందుకు చాలా పెద్ద పెద్ద ఆఫర్స్ వచ్చాయని, అయినా కూడా అతను నాకు ఇచ్చిన కమిట్మెంట్ వలన, వేరే సినిమాలు చెయ్యకుండా, నాకు చేశాకే వేరే సినిమా చేస్తా అన్నాడు. ఈమధ్య కొందరు ఆలా నాకు కమిట్మెంట్ ఇచ్చి గీత దాటి వెళ్లారు, వాళ్ళ గురించి నేను చెప్పటం లేదు, అని పరోక్షంగా దర్శకుడు పరశురామ్ (ParasuramPetla) ను ఉద్దేశించి అన్నట్టుగా చెప్పారు. ఎందుకంటే అక్కడ పరశురామ్ పేరు చెప్పకపోయినా అర్థం అయిపోతుంది.

ఎందుకంటే పరశురామ్ గీత ఆర్ట్స్ కి సినిమా చేయాల్సి ఉండగా, ఇంకో నిర్మాత దిల్ రాజు కి సినిమా చేస్తాను అని వొప్పుకొని అధికారికంగా ప్రకటించాడు కదా. అప్పుడు అల్లు అరవింద్ చాలా సీరియస్ అయి, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా అని అనగానే, అతన్ని పరిశ్రమలో కొంతమంది పెద్దలు సర్ది చెప్పి సరిపెట్టారు. ఆ విషయం అందరికీ తెలిసిందే, ఆ పరశురామ్ చేసిన పనిని పరోక్షంగా చిన్న సెటైర్ తో పేల్చారు.

Updated Date - 2023-06-01T13:29:48+05:30 IST