Alekhya Tarakratna: మరోసారి అలేఖ్య భావోద్వేగ పోస్ట్‌

ABN , First Publish Date - 2023-08-28T21:38:35+05:30 IST

నందమూరి తారకరత్న (TarakaRatna) మరణించి ఆరు నెలలు గడుస్తున్న ఆయన భార్య అలేఖ్య తారకరత్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు. యువగళం పాదయాత్రలో పాల్గొన్న ఆయన గుండెపోటుకు గురై సుమారు 23 రోజులు బెంగళూరులోని నారాయణ హృదయాలయలో వెంటిలేటర్‌పై చికిత్స పొందారు.

Alekhya Tarakratna: మరోసారి అలేఖ్య భావోద్వేగ పోస్ట్‌

నందమూరి తారకరత్న (TarakaRatna) మరణించి ఆరు నెలలు గడుస్తున్న ఆయన భార్య అలేఖ్య తారకరత్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు. యువగళం పాదయాత్రలో పాల్గొన్న ఆయన గుండెపోటుకు గురై సుమారు 23 రోజులు బెంగళూరులోని నారాయణ హృదయాలయలో వెంటిలేటర్‌పై చికిత్స పొందారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఏడాది ఫిబ్రవరి 18న ఆయన మరణించారు. ఆయన మృతితో నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తాజాగ వారి పిల్లల పుట్టినరోజు సందర్భంగా తారకరత్నను అలేఖ్య గుర్తుచేసుకున్నారు. నేడు తారకరత్న కవల పిల్లలు తాన్యారామ్‌, రేయా పుట్టినరోజు.

దీంతో అలేఖ్య సోషల్‌ మీడియాలో భావోద్వేగ పోస్ట్‌ చేశారు. తారకరత్నతో వారికున్న తీపిగుర్తులకు సంబంధించిన ఫోటోలను వీడియో రూపంలో షేర్‌ చేశారు. నిష్క తారకరత్న ఫోటోకు పువ్వులు పెడుతుండగా ఇద్దరు ట్విన్స్‌ ఆమెకు సాయం చేశారు. ‘‘తాన్యారామ్‌, రేయాలకు ఎంత ప్రయత్నించినా, ఎంత ఆలోచించినా వారిద్దరికీ పుట్టునరోజు శుభాకాంక్షలు ఆనందంగా చెప్పలేకపోతున్నాను. ఇలాంటి ఆనంద సమయంలో మీరు లేరు. కానీ పిల్లల ముఖంలో నువ్వు ఎప్పుడూ ఉంటావు. అలా మాతోనే ఉంటావ్‌. వర్షం కురిసే రోజు ఇంద్ర ధనస్సు కంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు, పొద్దుతిరుగుడు పువ్వు కంటే ఉత్సాహంగా ఉన్నావు. ఓబు, మమ్ము, ఎన్‌ నిష్క.. మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను, మీరు ఆనందాన్ని రెట్టింపు చేయాలి.

Updated Date - 2023-08-28T21:38:35+05:30 IST