సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Akkineni Nagarjuna: ప్రసన్నకుమార్ తో సినిమా ఉందా లేదా?

ABN, First Publish Date - 2023-04-19T17:50:14+05:30

ఇంతకీ అక్కినేని నాగార్జున, రైటర్ ప్రసన్న కుమార్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ రావాల్సిన సినిమా ఉందా? లేదా? ఎప్పుడో షూటింగ్ మొదలెట్టాల్సిన ఈ సినిమా ఇంతవరకు డిలే అయింది అంటే అదే అనిపిస్తోంది అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), రైటర్ ప్రసన్న కుమార్ (Bezawada Prasanna Kumar) తో కలిసి ఒక సినిమా చేస్తున్నారు అనే వార్త ఎప్పుడో వచ్చింది. ఆ సినిమా కథ కూడా లాక్ అయింది అన్నారు, షూటింగ్ కూడా మొదలెట్టేస్తున్నాం అని కూడా చెప్పారు. కానీ ఇన్నాళ్లు అవుతున్నా ఆ సినిమా గురించి ఎటువంటి వార్త రాలేదు, అప్డేట్ లేదు. ఆ సినిమాలో కథానాయికని కూడా ఎంపిక చేసుకున్నారు, మిగతా స్టార్ కాస్ట్ ని కూడా తీసుకున్నారు అని తెలిసింది, కానీ సినిమా మాత్రం మొదలవ్వలేదు. ఎందువల్ల?

అసలు ఇంతకీ ఈ సినిమా ఉందా? రైటర్ ప్రసన్న కుమార్ ఈ సినిమా కనక చేస్తే, ఇది అతనికి మొదటి సినిమా అవుతుంది దర్శకుడిగా. నాగార్జున అంతటి స్టార్ యాక్టర్ ప్రసన్నని పిలిచి దర్శకత్వం చెయ్యమని చెపితే, ఆ ప్రాజెక్ట్ ఎందుకు ఇంతలా డిలే అవుతోంది. ఈ సినిమా రీమేక్ హక్కులే డిలే కి కారణమా? అని పరిశ్రమలో చర్చ నడుస్తోంది.

ఎందుకంటే ప్రసన్న కుమార్ కథ ఒక పీరియడ్ డ్రామా, ఈ కథలో కొన్ని సన్నివేశాలు మలయాళం (Malayalam) సినిమా 'పోరింజు మరియం జోస్' #PorinjuMariamJose ఆధారంగా రాసాడని తెలిసింది. అయితే ఈ విషయం నాగార్జునకి మొదటి చెప్పలేదని కూడా టాక్ నడుస్తోంది. ఎప్పుడయితే 'కాశ్మీర్ ఫైల్స్' (TheKashmirFiles) నిర్మాత అభిషేక్ అగర్వాల్ (Abhishek Agarwal) ఈ 'పోరింజు మరియం జోస్' రీమేక్ హక్కులు తాను తీసుకున్నాను అని ట్వీట్ చేసాడో అప్పుడే నాగార్జున కి కూడా విషయం తెలిసిందని, అప్పుడే ఈ వివాదం కూడా మొదలయిందని, అది ఈరోజు వరకు నడుస్తోందని కూడా తెలిసింది.

అభిషేక్ అగర్వాల్ మార్చి 8 న ట్వీట్ చేసేడు ఈ సినిమా తెలుగు, హిందీ రీమేక్ హక్కులు కొన్నట్టుగా. అయితే అతను అప్పుడే ఒక స్టార్ తో తీయడానికి అన్ని హంగులూ పూర్తి చేస్తున్నామని కూడా ప్రకటించాడు, కానీ ఇంతవరకు అతను కూడా అధికారికంగా ఎవరు నటిస్తున్నారు అన్నది చెప్పలేదు. ముందుగా అనుకున్న ప్రకారం అయితే ప్రసన్న కుమార్, నాగార్జున సినిమాకి చిట్టూరి శ్రీనివాస్ (Chitturi Srinivas) నిర్మాత. ఇది నాగార్జున కెరీర్ లో పెద్ద ప్రాజెక్ట్ గా తీయాలని అనుకున్నారు అని తెలిసింది, కానీ ఇప్పుడు అభిషేక్ అగర్వాల్ రీమేక్ హక్కులు కొనడం తో మొత్తం ప్రాజెక్ట్ ఆగిపోయినట్టుగా కనపడుతోంది. మలయాళం సినిమాని జోషియా (Joshiy) దర్శకత్వం చెయ్యగా, జోజు జార్జ్ (Joju George) ప్రధాన పాత్ర పోషించాడు. ఇది 2019లో విడుదల అయి, పెద్ద హిట్ అయింది.

ఇప్పుడు పరిశ్రమలో టాక్ ఏంటంటే నాగార్జున, ప్రసన్న కుమార్ సినిమా ఆపేసారా, లేక ప్రసన్న కుమార్ స్క్రిప్ట్ పూర్తి చేసేసాడు కాబట్టి, అతనికి బదులు వేరే వాళ్ళని దర్శకుడిగా పెట్టి ఈ సినిమా కంటిన్యూ చేస్తారా, అభిషేక్ అగర్వాల్ కూడా అందులో నిర్మాతగా చేరతాడా, వీటన్నిటికీ సమాధానాలు ఈ సినిమాతో ముడిపడిన వాళ్ళు చెప్తారేమో ఎదురు చూడాలి.

Updated Date - 2023-04-19T17:50:14+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!