Adivi Sesh: 'గూఢచారి 2' లో కథానాయకురాలిని మార్చిన అడివి శేష్

ABN , First Publish Date - 2023-11-20T18:47:07+05:30 IST

అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న 'జి2' సినిమాలో కథానాయకురాలిగా ఒక హిందీ నటిని తీసుకున్నారు. ఈ సినిమా 'గూడచారి' సినిమాకి సీక్వెల్ గా వస్తున్న విషయం తెలిసిందే.

Adivi Sesh: 'గూఢచారి 2' లో కథానాయకురాలిని మార్చిన అడివి శేష్
Adivi Sesh

అడివి శేష్ (AdiviSesh) నటించిన 'గూఢచారి' #Goodachariమంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా 'గూఢచారి 2' #G2 వస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా మోడలింది, కానీ ఇందులో అడవి శేష్ పక్కన కథానాయికగా ఎవరు నటిస్తున్నారు అనే విషయం ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. #Goodachari2 ఈరోజు తాజాగా ఈ చిత్రంలో కథానాయకురాలు పేరుని ప్రకటించారు. అడివి శేష్‌ కు జోడిగా బనితా సంధు అనే ఆమె నటిస్తోందని చిత్ర నిర్వాహకులు తెలియజేశారు. 'గూఢచారి' లో శోభిత ధూళిపాళ (SobithaDhulipala) కథానాయికగా చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సీక్వెల్ ఇతర భాషల్లో కూడా విడుదల అవుతూ ఉండటం వలన హిందీ నటి అయిన బనిత ని తీసుకున్నట్టుగా తెలిసింది.

'మేజర్', 'కాశ్మీర్ ఫైల్స్', 'కార్తికేయ 2' నిర్మించిన వల్లీ ఈ 'గూఢచారి 2' సినిమా కూడా నిర్మిస్తున్నారు. ముందు సినిమా వలే ఇది కూడా ఒక యాక్షన్ స్పై థ్రిల్లర్. 'అక్టోబర్', 'సర్దార్‌ ఉదమ్‌' వంటి హిందీ చిత్రాలతో నటించి బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుంది బనిత. అంతేకాదు, ఆమె ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్, పంజాబీ పరిశ్రమలలో పని చేస్తున్నారు. 'G2' లో సరికొత్త పాత్రలో ఆమె కనపడనుంది.

goodachari2leadactressbanit.jpg

బనితకి ఇది మొదటి తెలుగు సినిమా, అలాగే ఇది ఇతర భాషల్లో కూడా విడుదలవుతుంది. ఇందులో తను ఒక వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్నందుకు ఆనందంగా వుంది అని చెప్పింది ఆమె. వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.

Updated Date - 2023-11-20T18:47:08+05:30 IST