Suriya: నువ్వొక ధ్రువతారవు.. ఎప్పుడూ వెలుగుతూనే ఉంటావు!

ABN , First Publish Date - 2023-05-20T15:00:31+05:30 IST

ఇటీవల టెక్సాస్‌లోని ఓ మాల్‌లో జరిగిన కాల్పుల ఘటనలో ఐశ్వర్య తాటికొండ (Aishwarya Tatikonda) అనే యువతి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఐశ్వర్య మృతి ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది

Suriya: నువ్వొక ధ్రువతారవు.. ఎప్పుడూ వెలుగుతూనే ఉంటావు!

ఇటీవల టెక్సాస్‌లోని ఓ మాల్‌లో జరిగిన కాల్పుల ఘటనలో ఐశ్వర్య తాటికొండ (Aishwarya Tatikonda) అనే యువతి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఐశ్వర్య మృతి ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఈ నెల 6న టెక్సాస్‌లోని ఓ మాల్‌లో దుండగులు జరిపిన కాల్పులో ఐశ్వర్య సహా ఏడుగురు మృతి చెందారు. తమిళ హీరో సూర్యకు Hero suriya) ఆమె వీరాభిమాని. తన అభిమాని ఐశ్వర్య చనిపోయిందన్న విషయం తెలుసుకున్న సూర్య భావోద్వేగానికి లోనయ్యాడు. ఆమె మృతి పట్ల విచారం (Suriya Fan)వ్యక్తం చేశారు. ఐశ్వర్య చిత్ర పటం వద్ద పూలు ఉంచి శ్రద్థాంజలి ఘటించారు. ఐశ్వర్య కుటుంబానికి సానుభూతి తెలుపుతూ ఓ లేఖ రాశారు. ‘‘మీ కుటుంబాన్ని ఎలా ఓదార్చాలో తెలియడం లేదు. నాకు నోట మాటలు రావడం లేదు. ఐశ్వర్య మృతి తీరని లోటు. టెక్సాస్‌లో జరిగిన కాల్పుల్లో మీ కుమార్తె ఐశ్వర్య కన్నుమూయడం దురదృష్టకరం. ఆమె ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచే ఉంటుంది. ఒక ధ్రువతారల వెలుగుతూనే ఉంటుంది’’ అని ఐశ్వర్య తల్లిదండ్రులను ఓదార్చే ప్రయత్నం చేశారు సూర్య.

అలాగే, ‘‘ఇవి నీ మృతికి నివాళిగా రాస్తున్న అక్షరాలు కావు. నువ్వు నిజమైన హీరోవి. నీ ేస్నహితులు, కుటుంబ సభ్యులకు నువ్వొక ధ్రువతారవు. నువ్వు చిందించే చిరునవ్వు, నీలో ఉన్న ప్రేమను పంచే వ్యక్తిత్వం ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతుంది’’ అని లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2023-05-20T16:44:19+05:30 IST