Rajini kanth : ఫైనల్‌ మ్యాచ్  గురించి ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-11-17T14:23:59+05:30 IST

తలైవా రజనీకాంత్  క్రికెట్‌కు వీరాభిమాని అన్న విషయం అందరికీ తెలిసిందే! సినిమాలతోపాటు క్రికెట్‌ గురించి, తనకు ఇష్టమైన క్రికెటర్ల గురించి అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. భారత్‌-న్యూజిలాండ్‌ సెమీ ఫైనల్స్‌ మ్యాచ్‌కు కుటుంబ సమేతంగా వెళ్లి సందడి చేశారు. వరల్డ్‌ కప్‌ ఫైనల్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Rajini kanth :  ఫైనల్‌ మ్యాచ్  గురించి ఆసక్తికర వ్యాఖ్యలు

తలైవా రజనీకాంత్ (Rajinikanth) క్రికెట్‌కు వీరాభిమాని అన్న విషయం అందరికీ తెలిసిందే! సినిమాలతోపాటు క్రికెట్‌ గురించి, తనకు ఇష్టమైన క్రికెటర్ల గురించి అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. భారత్‌-న్యూజిలాండ్‌ సెమీ ఫైనల్స్‌ (Semi finals) మ్యాచ్‌కు కుటుంబ సమేతంగా వెళ్లి సందడి చేశారు. వరల్డ్‌ కప్‌ ఫైనల్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే సెమీ ఫైనల్స్‌లో రికార్డులు సృష్టించిన కోహ్లీ (kohli) , షమీలకు (Shami) తలైవా శుభాకాంక్షలు చెప్పారు. స్పిన్నర్‌ అశ్విన్‌తో దిగిన ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ గురించి రజనీకాంత్  మాట్లాడుతూ ‘‘ఆట మొదలైన కాసేపటి వరకూ కాస్త టెన్షన్‌ పడ్డాం. ఒక్కో వికెట్‌ పడేకొద్దీ పరిస్థితి మనకు అనుకూలంగా మారింది. మొదటి గంటన్నర మాత్రం చాలా ఆందోళనగా అనిపించింది. ఈసారి ప్రపంచకప్‌ వందశాతం భారత్‌కే వస్తుంది’’ అది ధీమాగా చెప్పారు.


'జైలర్‌' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రజనీకాంత్  ప్రస్తుతం టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. అలాగే ఆయన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో ‘లాల్‌ సలామ్‌’ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. 

Updated Date - 2023-11-17T14:24:01+05:30 IST