Mani Ratnam అభిమానులపై మణిరత్నం ఫైర్‌! 

ABN , First Publish Date - 2023-11-20T17:22:15+05:30 IST

సోషల్‌ మీడియా (Social media Fans war) వేదికగా అభిమానుల మధ్య జరిగే మాటల యుద్దాన్ని ఉద్దేశించి దర్శకుడు మణిరత్నం (Maniratnam) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఓ వేదికపై ఆయన మాట్లాడుతూ "సామాజిక మాధ్యమాల్లో ఎవరెవరో ఏవేవో కామెంట్స్‌ చేస్తుంటారు. ఎదుటివ్యక్తులను దూషించడానికే వారు సోషల్‌ మీడియాను ఉపయోగిస్తున్నారు.

Mani Ratnam  అభిమానులపై మణిరత్నం ఫైర్‌! 

సోషల్‌ మీడియా (Social media Fans war) వేదికగా అభిమానుల మధ్య జరిగే మాటల యుద్దాన్ని ఉద్దేశించి దర్శకుడు మణిరత్నం (Maniratnam) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఓ వేదికపై ఆయన మాట్లాడుతూ "సామాజిక మాధ్యమాల్లో ఎవరెవరో ఏవేవో కామెంట్స్‌ చేస్తుంటారు. ఎదుటివ్యక్తులను దూషించడానికే వారు సోషల్‌ మీడియాను ఉపయోగిస్తున్నారు. అక్కడ జరిగే చర్చలు, విమర్శలు రోడ్డు పక్కన జరిగే చర్చలా ...  ఉంటాయి. అవసరమైన విషయాలపై ఏదైనా చర్చలు జరిపితే ఫర్వాలేదు కానీ నాకు విజయ్‌ ఇష్టం, అజిత్ అంటే ఇష్టం, ఇంకో హీరో అంటే ఇష్టం అంటూ వాగ్వాదానికి దిగడంలో ఎలాంటి అర్థం లేదు’’ అని చెప్పారు. (HeroFans war)

ఈ మధ్యకాలంలో సినిమా విడుదల సమయంలో ట్విట్టర్‌ వేదికగా జరిగిన తరచూ అభిమానుల మధ్య వార్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే! మా హీరో గొప్ప అని కొంతమంది అంటే.. లేదు మా హీరోనే గొప్ప అని ఇంకొంత మంది పోస్టులు చేస్తుంటారు. కొన్నిసార్లు హద్దు మీరి అసభ్యపదజాలాలతో దూషించుకుంటారు. దీనిపై ఇప్పటికే చాలామంది చాలామంది స్టార్లు స్పందించి ‘మేమంతా ఒక్కటే.. సినిమాల పరంగా మా మధ్య పోటీ ఉండొచ్చు కానీ వ్యక్తిగతంగా మా అందరి మధ్య మంచి అనుబంధం, స్నేహం ఉంటాయి. మీరు కూడా అలాగే  కలిసిమెలిసి ఉండాలి’ అని ఎన్నోసార్లు చెప్పినా అభిమానుల్లో మార్పు రాలేదు. సోషల్‌ మీడియాలో యుద్దాలు ఆగడం లేదు. ఈ విషయం గురించే తాజాగా మణిరత్నం స్పందించారు. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ సిరీస్‌ చిత్రాలతో అలరించిన ఆయన  ప్రస్తుతం ‘థగ్‌ లైఫ్‌’ (Thug life) కోసం వర్క్‌ చేస్తున్నారు. కమల్‌హాసన్‌ హీరోగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దనున్నారు. దుల్కర్‌ సల్మాన్‌, జయం రవి కీలక  పాత్రలు పోషించనున్నారు. త్రిష కథానాయిక. 


Updated Date - 2023-11-20T17:22:16+05:30 IST