Manju Warrier: ఖరీదైన బైక్‌ను కొన్న హీరోయిన్.. ధర వింటే షాకే..

ABN , First Publish Date - 2023-02-19T17:08:23+05:30 IST

మాలయాళంలోని స్టార్ హీరోయిన్స్‌లో మంజు వారియర్ (Manju Warrier) ఒకరు. ‘అసురన్’, ‘లూసిఫర్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. తాజాగా అజిత్ హీరోగా నటించిన ‘తుణివు’ (Thunivu) లో కనిపించారు.

Manju Warrier: ఖరీదైన బైక్‌ను కొన్న హీరోయిన్.. ధర వింటే షాకే..

మాలయాళంలోని స్టార్ హీరోయిన్స్‌లో మంజు వారియర్ (Manju Warrier) ఒకరు. ‘అసురన్’, ‘లూసిఫర్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. తాజాగా అజిత్ హీరోగా నటించిన ‘తుణివు’ (Thunivu) లో కనిపించారు. ఈ చిత్రం తెలుగులో ‘తెగింపు’ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ షూటింగ్ సమయంలో అజిత్‌తో కలసి ఆమె బైక్ యాత్ర చేపట్టారు. మరి కొంత మంది బైకర్స్‌తో కలసి కశ్మీర్‌తో సహా లే-లఢక్‌లో గతేడాది ప్రయాణించారు. ఈ యాత్ర పూర్తయిన అనంతరం ఓ ఖరీదైన బైక్‌ను కొనుగోలు చేయాలని ఆమె నిర్ణయించుకున్నారు. తాజాగా ఆ కలను నెరవేర్చుకున్నారు.

బీఎమ్‌డబ్ల్యూ బ్రాండ్‌కు చెందిన జీఎస్ 1250 విలాసవంతమైన బైక్‌ను మంజు వారియర్ కొనుగోలు చేశారు. ఈ మోటార్ బైక్ ధర ఇండియాలో రూ.20లక్షల నుంచి రూ.25లక్షల వరకు ఉంటుందని సమాచారం అందుతుంది. ఖరీదైన బైక్‌ను కొనడంతో మంజు వారియర్ తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘‘కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాలంటే కొంచెం ధైర్యం ఉంటే చాలు. ఒక మంచి రైడర్‌గా మారాలంటే అంతకు ముందు చాలా దూరం ప్రయాణించాలి. రోడ్డు మీద ఘోరంగా నడుపుతుంటే మీరు ఎక్కడైనా నన్ను చూడొచ్చు. అటువంటి సమయంలో నాతో కొంచెం ఒపికగా వ్యహరించండి. నా లాంటి వారికి స్ఫూర్తిగా నిలుస్తున్న అజిత్ కుమార్‌కు ధన్యవాదాలు’’ అని మంజు వారియర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మంజు మోటార్ బైక్‌ను కొనడంతో అనేక మంది సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెప్పారు. టొనినో థామస్, ఐశ్వర్య లక్ష్మీ, భావన మీనన్, పార్వతి తదితరులు విషెస్ తెలిపారు. మంజువారియిర్ నెల రోజుల‌ క్రితమే డ్రైవింగ్ లైసెన్స్‌ను సంపాదించడం చెప్పుకోదగ్గ విశేషం.

Updated Date - 2023-02-19T17:08:24+05:30 IST