Lokesh Kangaraju : కర్రల సాయంతో కాలినడకన తిరుమలకు..

ABN , First Publish Date - 2023-10-12T15:17:46+05:30 IST

విజయ్‌ హీరోగా లోకేశ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన చిత్రం లియో’. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ అతిథి పాత్రలో నటిస్తున్నారని నెట్టింట వార్తలు హల్‌చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే!

Lokesh Kangaraju : కర్రల సాయంతో కాలినడకన తిరుమలకు..

విజయ్‌ హీరోగా లోకేశ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన చిత్రం 'లియో’. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ అతిథి పాత్రలో నటిస్తున్నారని నెట్టింట వార్తలు హల్‌చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే! ఇటీవల ఓవర్సీస్‌లో ఈ చిత్రం ఆనలైన బుకింగ్‌ మొదలైంది. ఆయా బుకింగ్‌ సైట్స్‌లో లియో క్యాస్టింగ్‌లో రామ్‌చరణ్‌ పేరు ఉండడంతో ఈ వార్త వైరల్‌ అయింది. అంతే కాదు. తాజాగా మరోసారి ఈ చిత్రానికి సంబంధించిన వార్త నెట్టింట సందడి చేస్తోంది. కోబ్రా ఈజ్‌ కమింగ్‌ అంటూ రామ్‌చరణ్‌కు సంబంధించిన పోస్టర్‌ను నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే దీనిపై నిర్మాణ సంస్థ అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు.

కాలి నడకన తిరుమలకు...

దర్శకులు లోకేష్‌ కనగరాజు తన బృందంతో కలిసి తిరుమలకు కాలినడకన వెళ్లారు. సినిమా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో ఆయన తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. అలిపిరి మెట్ల మార్గంలో కాలి నడకన వెళ్లి మొక్కు తీర్చుకున్నారు.

ఈ మధ్యకాలంలో తిరుమల కొండల్లో చిరుతలు దాడుల నేపథ్యంలో లోకేష్‌ కర్రల సాయంతో తన బృందంతో తిరుమలకు చేరుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

Updated Date - 2023-10-12T15:17:46+05:30 IST