Jigarthanda Double X: దీపావ‌ళికి కార్తీక్ సుబ్బ‌రాజ్ ఫిక్స్ అయిపోయాడు

ABN , First Publish Date - 2023-05-16T11:55:27+05:30 IST

వైవిధ్యమైన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తన సినిమా 'జిగ‌ర్ తండా డ‌బుల్ ఎక్స్‌’ ని రాబోయే దీపావళి పండగ సందర్భంగా విడుదల చెయ్యాలని ఫిక్స్ అయ్యాడు. ఎప్పుడో నవంబర్ నెలలో వచ్చే పండగకు ఇప్పుడే డిసైడ్ అయిపోయాడు. రాఘవ లారెన్స్, సూర్య ఇందులో ప్రాధాన పాత్రలు పోషిస్తున్నారు

Jigarthanda Double X: దీపావ‌ళికి కార్తీక్ సుబ్బ‌రాజ్ ఫిక్స్ అయిపోయాడు
Raghava Lawrence in JIgarthanda Double X

తమిళ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) ఒక వైవిధ్యమైన దర్శకుడు, అతని సినిమాల కోసం ఎదురుచూసే ప్రేక్షకులు వున్నారు. అతను అప్పుడప్పుడే పదేళ్లు కిందట తీసిన 'జిగ‌ర్ తండా' (Jigarthanda) సినిమా పెద్ద విజయం సాధించింది. ఇందులో సిద్ధార్థ్ (Siddharth), బాబీ సింహ (Bobby Simha) లీడ్ యాక్టర్స్ గా వేశారు. ఇప్పుడు ఆ సినిమాకి ప్రీక్వెల్ గా 'జిగ‌ర్ తండా డ‌బుల్ ఎక్స్‌’ (Jigarthanda Double X) అని తీస్తున్నాడు కార్తిక్ సుబ్బరాజ్. అయితే ఇందులో రాఘ‌వ లారెన్స్‌ (RaghavaLawrence), ఎస్‌ జె సూర్య (SJ Suryah) ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తున్నారు.

SJSuryah.jpg

‘జిగ‌ర్ తండా డ‌బుల్ ఎక్స్‌’ ఒక హై యాక్ష‌న్ డ్రామా గా రూపు దిద్దుకుంటోంది, అయితే దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ ఈ సినిమా విడుదల తేదీని మాత్రం అప్పుడే ఫిక్స్ చేసేసుకున్నాడు. ఈ సినిమా దీపావ‌ళికి విడుదల అవుతుందని, అప్పుడు రాబోతున్న‌ భారీ చిత్రాల్లో మొదట విడుదల తేదీని ఫిక్స్ చేసుకున్న మూవీ ఇది అవుతుంది. అదే సమయంలో ఈ సినిమాని తమిళంతో పాటు, తెలుగు, హిందీ భాష‌ల్లో కూడా విడుదల చేస్తున్నారు అని ఒక ప్రకటనలో తెలిపారు.

raghavalawrence.jpg

ఈ సినిమా షూటింగ్ గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లోనే స్టార్ట్ చేశారు. అప్ప‌టి నుంచి శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంటోంది. 2014లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన జిగ‌ర్ తండా చిత్రానికి ఇది ప్రీక్వెల్‌. మూవీ అనౌన్స్‌మెంట్ వ‌చ్చిన రోజు నుంచి ఈ సినిమాపై మంచి అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. కార్తీక్ సుబ్బ‌రాజ్ మాట్లాడుతూ ఇంత‌కు ముందు నా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన 'జిగ‌ర్ తండా'కు ఇది ప్రీక్వెల్‌గా రానుంది. ఆ సినిమా సాధించిన‌ట్లే ‘జిగ‌ర్ తండా డ‌బుల్ ఎక్స్‌’ కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవుతుంద‌ని భావిస్తున్నాను, అని అన్నాడు.

Updated Date - 2023-05-16T11:55:27+05:30 IST