Yash: 'జాన్ విక్' దర్శకుడితో 'కేజీఎఫ్' నటుడు ఫోటో వైరల్, ఎందుకంటే...

ABN , First Publish Date - 2023-09-27T12:55:04+05:30 IST

'కేజీఎఫ్' నటుడు యాష్ మరోసారి వార్తల్లో వున్నారు. ఈసారి అతని ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. లండన్ లో అతను 'జాన్ విక్' సినిమా దర్శకుడు జెజె పెర్రీని కలిసాడు.

Yash: 'జాన్ విక్' దర్శకుడితో 'కేజీఎఫ్' నటుడు ఫోటో వైరల్, ఎందుకంటే...
Actor Yash

'కేజీఎఫ్' #KGF సినిమా రెండు భాగాలుగా విడుదలై చాలా పెద్ద విజయం సాధించింది, అందులో కథానాయకుడిగా నటించిన యష్ (Yash) పేరు ప్రపంచ స్థాయిలో వినపడేటట్టు చేసింది. అంతలా విజయం సాధించింది ఆ సినిమా. 'కేజీఎఫ్ 2' #KGF2 విడుదలై సుమారు ఒకటిన్నర సంవత్సరం అవుతున్నా యష్ #Yash తన తదుపరి సినిమా గురించి ఇంకా అధికారిక ప్రకటన మాత్రం ఇవ్వలేదు. అంత పెద్ద విజయం తరువాత ఎటువంటి సినిమా చెయ్యాలనే సందిగ్ధంలో వుండి చాలా రోజులు ఆగిపోయాడు అని వార్తలు వచ్చాయి.

మలయాళం దర్శకురాలు గీతూ మోహన్ దాస్ (GeethuMohanDas) ఇప్పుడు యష్ #Yash19 ని దర్శకత్వం చేస్తున్నారనే వార్త కూడా వచ్చింది. అయితే దీని మీద ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమాని యష్ తన సొంత బ్యానర్ లో నిర్మించే యోచనలో ఉన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి లుక్ టెస్ట్ జరుగుతోందని అతని అభిమానులు సాంఘీక మాధ్యమాల్లో పెడుతున్నారు.

yash-viral.jpg

ఇదిలా ఉంటే, యష్ హాలీవుడ్ దర్శకుడు జెజె పెర్రీ (JJPerry) ని కలవటం ఒక చర్చగా మారింది. ఈ ఫోటో ఇప్పుడు సాంఘీక మాధ్యమంలో వైరల్ అయింది కూడా. లండన్ లో ఈ హాలీవుడ్ దర్శకుడిని యష్ కలిసినట్టుగా చెపుతున్నారు. ఇంతకీ జెజె పెర్రీ అంటే ఎవరో తెలుసా కియాను రీవ్స్ (KeanuReevs) కథానాయకుడిగా వచ్చిన 'జాన్ విక్' #JohnWick సినిమా దర్శకుడు. అటువంటి దర్శకుడిని యష్ కలవటం ఇద్దరి ఫోటో వైరల్ అవటం, ఇక అభిమానుల్లో ఒకటే ఆనందం. యష్ తన తదుపరి సినిమా 'జాన్ విక్' దర్శకుడు పెర్రీ తో చేస్తున్నాడు అన్న వార్త కూడా వైరల్ అవుతోంది.

Updated Date - 2023-09-27T13:14:06+05:30 IST