Manipur Issue: స్పందించిన తారాలోకం.. ఆ శిక్ష ఎలా ఉండాలంటే

ABN , First Publish Date - 2023-07-21T00:45:27+05:30 IST

మణిపూర్‌లో (Manipur Violence)ఇద్దరు మహిళలను నగ్నంగా నడిపించిన ఘటనపై రష్మిక (Rashmika mandanna, కియార, అక్షయ్‌ కుమార్‌, ప్రగ్యా జైస్వాల్‌ వాణీ కపూర్‌ వంటి సినీ సెలబ్రిటీలు స్పందించారు. అసలు సొసైటీలో ఏం జరుగుతోంది? ఇలాంటి దోషులకు కఠిన శిక్ష పడాలి’’ అలంటే సినీ తారలు సోషల్‌మీడియా వేదికగా గళమెత్తారు.

Manipur Issue: స్పందించిన తారాలోకం.. ఆ శిక్ష ఎలా ఉండాలంటే

మణిపూర్‌లో (Manipur Violence)ఇద్దరు మహిళలను నగ్నంగా నడిపించిన ఘటనపై రష్మిక (Rashmika mandanna, కియార, అక్షయ్‌ కుమార్‌, ప్రగ్యా జైస్వాల్‌ వాణీ కపూర్‌ వంటి సినీ సెలబ్రిటీలు స్పందించారు. అసలు సొసైటీలో ఏం జరుగుతోంది? ఇలాంటి దోషులకు కఠిన శిక్ష పడాలి’’ అలంటే సినీ తారలు సోషల్‌మీడియా వేదికగా గళమెత్తారు. ఈ మేరకు రష్మికా మందన్నా, అక్షయ్‌ కుమార్‌, కియారా అడ్వాణీ, ప్రగ్యా జైస్వాల్‌, సోనూ సూద్‌, రితేష్‌ దేశ్‌ముఖ్‌, రష్మీ గౌతమ్‌ సహా పలువురు మణిపూర్‌ తారలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు చేశారు.

‘‘మణిపూర్‌ మహిళలపై దాడికి పాల్పడిన వాళ్ళకు విధించే శిక్ష, మరొకరికి ఇలాంటి చర్యలకు పాల్పడాలనే ఆలోచన కూడా రాని విధంగా ఉండాలి’’ అని అక్షయ్‌ కుమార్‌ (Akshay kumar) అన్నారు.

‘‘నేను ఈ విధంగా చెబుతున్నందుకు క్షమించిండి. నేను చదివిన వార్తను నమ్మలేకపోతున్నాను. నన్ను ఆ ఘటన చాలా కలవరపెడుతోంది. ఆ మహిళలను తలచుకుంటే హృదయం తరుక్కుపోతోంది. దోషులకు శిక్ష పడుతుందని ఆశిస్తున్నాను’’ అని నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ చేశారు.

2.jpg

‘‘మణిపూర్‌ ఘటన గురించి తెలిశాక గుండె ముక్కలైంది. ఆ దారుణాతి దారుణమైన ఘటనను ఎంత ఖండించినా సరిపోదు. త్వరగా ఆ మహిళలకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను’’ అని ప్రగ్యా జైస్వాల్‌ పేర్కొన్నారు. (Pragya jaiswal)

Kiara.jpg

‘‘మణిపూర్‌ మహిళలపై జరిగిన దాడి భయంకరమైనది. వీలైనంత త్వరగా ఆ మహిళలకు న్యాయం జరగాలని ప్రార్థిస్తున్నాను. ఈ దాడికి కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలి’’ అని కియారా అడ్వాణీ పేర్కొన్నారు. మణిపూర్‌ ఘటన వెన్నులో వణుకు పుట్టించేలా ఉందని బాలీవుడ్‌ హీరోయిన్‌ వాణీ కపూర్‌ తెలిపారు.

Updated Date - 2023-07-21T00:52:14+05:30 IST