Chiyaan Vikram: అనురాగ్‌ మీకు అప్పుడే చెప్పా..

ABN , First Publish Date - 2023-05-23T10:11:32+05:30 IST

‘కెన్నెడీ’ సినిమాను ఉద్దేశిస్తూ చియాన్‌ విక్రమ్‌పై అనురాగ్‌ కశ్యప్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై విక్రమ్‌ స్పందించారు.

Chiyaan Vikram: అనురాగ్‌ మీకు అప్పుడే చెప్పా..

‘కెన్నెడీ’(Kennedy) సినిమాను ఉద్దేశిస్తూ చియాన్‌ విక్రమ్‌(Vikram)పై అనురాగ్‌ కశ్యప్‌ (Anurag Kashyap)చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై విక్రమ్‌ స్పందించారు. అనురాగ్‌ తన కోసం కథ రాశారని తెలిసిన వెంటనే, తాను ఆయన్ని సంప్రదించినట్లు తెలిపాఉ. ఏడాది క్రితం ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలను గుర్తు చేస్తూ విక్రమ్‌ ఓ ట్వీట్‌ చేశారు. ‘‘డియర్‌ అనురాగ్‌ కశ్యప్‌.. సోషల్‌ మీడియాలో ఉన్న స్నేహితులు, శ్రేయోభిలాషుల కోసం ఏడాది క్రితం మన ఇద్దరి మఽధ్య జరిగిన సంభాషణ గురించి గుర్తు చేయాలనుకుంటున్నా. ఈ సినిమా కోసం నన్ను ఈ మెయిల్‌, మెసేజ్‌లో రూపంలో సంప్రదించినప్పటికీ నా నుంచి మీకు ఎలాంటి సమాధానం రాలేదని గతంలో మీరు ఓ నటుడిగా చెప్పారు. అతని ద్వారా విషయం తెలుసుకున్న నేను వెంటనే మీకు ఫోన్‌ చేశాను. ఏ మెయిల్‌ ఐడీకి మీరు సందేశాలు పంపారో.. అది యాక్టివ్‌గా లేదని, నా ఫోన్‌ నంబర్‌ కూడా దాదాపు రెండేళ్ల క్రితమే మార్చేశానని.. అందుకే నన్ను రీచ్‌ కాలేకపోయారని అప్పుడే మీకు తెలిపాను. ‘కెన్నెడీ’ నాకెంతో నచ్చిందని అప్పుడే చెప్పాను కదా. ఎందుకంటే అది నా పేరు కదా. ఆల్‌ ద బెస్ట్‌’’ అని విక్రమ్‌ ట్వీట్‌ చేశారు. విక్రమ్‌ చేసిన ట్వీట్‌తో ఆయన అభిమానులు అనురాగ్‌పై మండిపడుతున్నారు. Vikram Fans Fire on Anurag Kashyap)

తాజాగా అనురాగ్‌ కూడా విక్రమ్‌ ట్వీట్‌కు స్పందించారు. ‘‘నిజమే బాస్‌.. ఒక నటుడి ద్వారా విషయం తెలుసుకుని విక్రమ్‌ నన్ను సంప్రదించారు. అప్పుడే మాకు కూడా తెలిసింది ఆయనకు వేరే ఫోన్‌ నంబర్‌ ఉందని. అధికారిక మెయిల్‌, ఫోన్‌ నంబర్‌ను షేర్‌ చేశారు. ఆయన నా స్ర్కిప్ట్‌ చదవడానికి ఆసక్తి చూపించారు. కాకపోతే అప్పటికే మేము షూటింగ్‌ కోసం షెడ్యూల్‌ సిద్థం చేసేసుకున్నాం. మా చిత్రానికి ‘కెన్నెడీ’ అనే టైటిల్‌ పెట్టుకోవడానికి ఆయన పూర్తిగా అంగీకారం తెలిపారు. ఇటీవల నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘కెన్నెడీ’ అనే పేరు పెట్టడానికి కారణం మాత్రమే చెప్పాను. నా వ్యాఖ్యలకు ఓవర్‌ రియాక్ట్‌ కావలసిన అవసరం లేదు. విక్రమ్‌తో కలిసి పనిచేయకుండా రిటైర్‌ అయితే కాను’’ అని స్పష్టత ఇచ్చారు.

ప్రస్తుతం రాహుల్‌ భట్‌, సన్నీలియోన్‌ జంటగా ‘కెన్నెడీ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు అనురాగ్‌ కశ్యప్‌. తాజాగా ఈ చిత్రాన్ని కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ఆ వేదికపై అనురాగ్‌ విక్రమ్‌ను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘విక్రమ్‌ను దృష్టిలో ఉంచుకునే తాను ఈ కథను సిద్థం చేశానని, ఈ సినిమా విషయంలో ఆయన్ని సంప్రదించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని, అందుకే రాహుల్‌తో ఈ సినిమా చేస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యాఖ్యలు వైరల్‌ కావడంతో విక్రమ్‌ స్పందించారు.

Updated Date - 2023-05-23T10:11:32+05:30 IST