Asvins: ఈ హర్రర్ సినిమా ఓటిటి లో ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో తెలుసా...

ABN , First Publish Date - 2023-07-17T16:28:38+05:30 IST

వసంత్ రవి నటించిన 'అశ్విన్స్' హారర్ సినిమా ఓటిటి లో స్ట్రీమింగ్ అవబోతోంది. తరుజ్ తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. విమల రామన్ ఒక ప్రధాన పాత్ర పోషించారు.

Asvins: ఈ హర్రర్ సినిమా ఓటిటి లో ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో తెలుసా...
A still from Asvins

ఆమధ్య విడుదలైన 'అశ్విన్స్' #Asvins సినిమా ఇటు తమిళంలోనూ, అటు తెలుగులోనూ ఒకేసారి విడుదల అయింది. ఈ సినిమాని తెలుగు నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ (BVSNPrasad) నిర్మించారు, తరుణ్ తేజ (TharunTeja) దర్శకత్వం వహించాడు. ఈ సినిమా హర్రర్ నేపథ్యంలో సాగే సినిమా. వసంత్ రవి (VasanthRavi) ఇందులో ప్రధాన పాత్ర పోషించాడు, విమల రామన్ (VimalaRaman) ఇంకో ముఖ్యపాత్ర పోషించింది. ఈ సినిమా ఒక కొత్త తరహా హర్రర్ ని ప్రేక్షకులకి పరిచయం చేసింది.

ఇప్పుడు ఈ హర్రర్ సినిమా ఓటిటి లో స్ట్రీమింగ్ కానుంది. ఇంతకీ ఇది ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది అంటే, ప్రముఖ ఓటిటి ఛానల్ నెట్ ఫ్లిక్స్ (NetFlix) లో జులై 20 (July20) వ తేదీన స్ట్రీమింగ్ అవుతుందని ఆ ఛానల్ తన సాంఘీక మాధ్యమం లో ప్రకటించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా చూడొచ్చు అని కూడా ప్రకటించింది.

asvinsott1.jpg

ఈ సినిమా కథ నేపధ్యం కూడా ఒక అయిదుగురు స్నేహితులు డార్కు టూరిజం #DarkTourism మీద ఒక వీడియో, యూట్యూబ్ కోసం చెయ్యడానికి ఇంగ్లాండ్ లోని ఒక దీవిలో వున్న పాడుపడిన బంగళాకి చేరుకుంటారు. ఈ టీముకి అర్జున్ (వసంత్ రవి) లీడర్ గా ఉంటాడు. ఈ బంగళాలో ఆర్తి రాజగోపాల్ (విమల రామన్) అనే ఒక ఆర్కియాలజిస్ట్ ఆత్మ తిరుగుతూ ఉంటుందని, ఇంతకు ముందే ఆమె 15 మందిని కూడా చంపిందని వార్తలు వున్నాయి. ఈ భవనంలో వుండే ఆత్మలను, అరుపులను తమ కెమెరాలతో బంధించి వీడియో తీయడానికి వెళ్లిన అర్జున్ టీము కి ఎటువంటి సంఘటనలు ఎదురయ్యాయి, వాళ్ళు వాటిని ఎలా ఎదుర్కొన్నారు, చివరికి ఏమైంది అనేది ఈ సినిమా కథ.

Updated Date - 2023-07-17T16:28:38+05:30 IST