King Nagarjuna: మేం ఆస్కార్ వరకు వెళ్లాం.. సినీ పరిశ్రమకు రాజధాని హైదరాబాదే..

ABN , First Publish Date - 2023-10-31T16:00:09+05:30 IST

ఇండియా జాయ్, ఫ్లయింగ్ మౌంటెయిన్ కాన్సెప్ట్స్ సమర్పణలో సినిమాటిక్ ఎక్స్ పో కార్యక్రమం హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో ఘనంగా జరిగింది. సినీ రంగానికి చెందిన 24 శాఖలకు చెందిన సరికొత్త సాంకేతికతను అందరికీ తెలియజేసే పరిచయ వేదికగా సినిమాటిక్ ఎక్స్ పో నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కింగ్ నాగ్.. మేం ఆస్కార్ వరకు వెళ్లాం.. సినీ పరిశ్రమకు రాజధాని హైదరాబాద్ అని అన్నారు.

King Nagarjuna: మేం ఆస్కార్ వరకు వెళ్లాం.. సినీ పరిశ్రమకు రాజధాని హైదరాబాదే..
Cinematic Expo Event

ఇండియా జాయ్, ఫ్లయింగ్ మౌంటెయిన్ కాన్సెప్ట్స్ సమర్పణలో సినిమాటిక్ ఎక్స్ పో (Cinematic Expo) కార్యక్రమం హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో ఘనంగా జరిగింది. సినీ రంగానికి చెందిన 24 శాఖలకు చెందిన సరికొత్త సాంకేతికతను అందరికీ తెలియజేసే పరిచయ వేదికగా సినిమాటిక్ ఎక్స్ పో నిలిచింది. ఈ ఏడాది జరిగిన సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైనింగ్, వి.ఎఫ్.ఎక్స్, స్పెషల్ ఎఫ్టెక్స్ రంగాలకు చెందిన సరికొత్త టెక్నాలజీని పరిచయం చేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున (King Nagarjuna) ముఖ్య అతిథిగా, దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు రోజురోజుకూ టెక్నికల్‌గా ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. నన్ను ఈ కార్యక్రమానికి పిలవడం ఆనందంగా ఉంది. 1974లో అన్నపూర్ణ స్టూడియోను ప్రారంభించాం. నెలకు ఒక షూటింగ్ జరిగితే చాలనుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకాల పరిణామాలు వచ్చాయి.. ఎంతగానో మార్పు వచ్చింది. హైద్రాబాద్ అనేది సినీ పరిశ్రమకు రాజధానిలా మారనుంది. సౌత్ ఫిల్మ్స్‌ని ఇండియా అంతా ఫాలో అవుతోంది. నాగ్ అశ్విన్ వంటి అద్భుతమైన దర్శకులు సత్తాను చాటుతున్నారు. మేం ఆస్కార్ వరకు వెళ్లాం. ఇండియా జాయ్ వారి గ్రాఫ్ అద్భుతంగా పెరుగుతూ వస్తోంది. తెలంగాణ ప్రభుత్వం, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, కార్యదర్శి జయేష్ రంజన్‌లు ఎంతో సహకరిస్తున్నారు. గేమింగ్, యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్ వంటి వారి గురించి తెలుసుకోవాలంటే ఇక్కడకు రండి. మా అన్నపూర్ణ కాలేజ్‌లోనూ కోర్సులున్నాయి. ఇలాంటి వేదికను ఏర్పాటు చేసి, నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు’’ అని అన్నారు.


King.jpg

డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. నేను కూడా యానిమేషన్ కోర్సులు నేర్చుకున్నాను. వీఎఫ్‌ఎక్స్ కంపెనీల చుట్టూ కథలు పట్టుకుని తిరిగాను. హాలీవుడ్‌లాంటి క్వాలిటీతో సినిమాలు ఎందుకు చేయరని అడుగుతుంటారు. కానీ గత పదేళ్లుగా అద్భుతమైన క్వాలిటీతో సినిమాలు తీస్తున్నాం. హాలీవుడ్ వాళ్లు కూడా ఇక్కడకు వచ్చి చేస్తున్నారు. ‘ప్రాజెక్ట్ K’ (Project K)ని పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా మూవీలా ఇక్కడి వీఎఫ్ఎక్స్ కంపెనీలతోనే చేద్దామని ప్రయత్నించాను. నెక్ట్స్ మూవీని ఇక్కడి వాళ్లతో కలిసి హాలీవుడ్ కంటే బెస్ట్ క్వాలిటీతో తీస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీస్, కామర్స్, ఐటీ డిపార్ట్‌మెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ మాట్లాడుతూ.. కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు యానిమేషన్, గేమింగ్ ఇండస్ట్రీ అంతగా అభివృద్ది చెందలేదు. ఆ ఇండస్ట్రీని ఈ స్థాయికి తీసుకొచ్చాం. కొత్త విధానాలను తీసుకొచ్చాం. 2016లో తీసుకొచ్చిన పాలసీ ఎంతో దోహదపడింది. దేశంలో ఎన్నో పాలసీలుంటాయి కానీ ఆచరణలోకి రావని అంటారు. కానీ మన రాష్ట్రంలో పాలసీలను ఆచరణలోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కేకే సెంథిల్, పి.జి. విందా, కంట్రీ హెడ్ ఫర్ టెక్నికల్ బిరేన్ గోస్, రోటో మేకర్ ఫౌండర్ మైక్, ఆశిష్ కులకర్ణి, సరస్వతి వాణి వంటి వారంతా ప్రసంగించారు.


ఇవి కూడా చదవండి:

========================

*Producer: తమన్నాతో పోల్చితే ఈ యంగ్‌ హీరోయిన్లు ఎంతో మేలు..

*******************************

*Razakar: సినిమా బ్యాన్‌పై సీఈఓ వికాస్ రాజ్‌ను కలిసిన ‘రజాకార్’ నిర్మాత

********************************

*Hard-Hitting Love Story: కొన్ని ప్రేమ కథలు జీవితకాలం వెంటాడుతాయి.. ‘బేబీ’ మేకర్స్ తగ్గేదే లే..

Updated Date - 2023-10-31T16:00:18+05:30 IST