IND vs NZ : వ‌ర‌ల్డ్‌క‌ప్‌ సెమీఫైన‌ల్‌.. స్టేడియానికి లైన్ క‌ట్టిన సినీ తార‌లు

ABN , First Publish Date - 2023-11-15T15:39:10+05:30 IST

2023 క్రికెట్ ప్రపంచకప్ సెమీ ఫైనల్ ముంబాయిలో ఈ రోజు(నవంబర్ 15)న జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రపంచమంతా వెయ్యి కళ్లతో ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తుండగా దేశ‌మంత‌టా మ‌న దేశం గెల‌వాల‌వంటూ ప్ర‌త్యేక పూజ‌లు కూడా చేస్తున్నారు. సినిమా స్టార్లు సైతం ఈ మ్యాచ్ చూడడానికి స్టేడియానికి లైన్ కట్టారు.

IND vs NZ : వ‌ర‌ల్డ్‌క‌ప్‌ సెమీఫైన‌ల్‌.. స్టేడియానికి లైన్ క‌ట్టిన సినీ తార‌లు
venkatesh, rajinikanth

2023 క్రికెట్ ప్రపంచకప్ సెమీ ఫైనల్ ముంబాయిలో ఈ రోజు(నవంబర్ 15)న జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రపంచమంతా వెయ్యి కళ్లతో ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తుండగా దేశ‌మంత‌టా మ‌న దేశం గెల‌వాల‌వంటూ ప్ర‌త్యేక పూజ‌లు కూడా చేస్తున్నారు. సినిమా స్టార్లు సైతం ఈ మ్యాచ్ చూడడానికి స్టేడియానికి లైన్ కట్టారు.

ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ నిన్ననే ముంబయ్ చేరుకోగా, విక్టరీ వెంకటేశ్, సచిన్, సారా టెండుల్కర్, అనుష్కాకోహ్లీ, జాన్ అబ్ర‌హం, ర‌ణ‌వీర్ క‌పూర్‌, సిద్ధార్థ్ మ‌ల్హోత్ర‌, కియారా అద్వానీలు సైతం స్టేడియానికి వెళ్లి ప్రేక్షకులలో క‌లిసిపోయి ఇండియా ఆటను ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫేమ‌స్ పుట్‌బాల్ స్టార్ డేవిడ్ బెక్‌హ‌మ్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాడు. ఇప్పుడు వీరి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.


అయితే ఇప్పటికే టాస్ గెటిచి బ్యాటింగ్ చేస్తున్న భార‌త జ‌ట్టు రోహిత్ శ‌ర్మ(47) వికెట్ కోల్పోగా శుభ‌మ‌న్ గిల్‌ (78), కోహ్లీ (29) ప‌రుగుల‌తో క్రీజ్‌లో ఉన్నారు. ప్ర‌స్తుతం 22 ఓవ‌ర్లు పూర్త‌య్యే స‌రికి భార‌త జ‌ట్టు159 ప‌రుగులు చేసింది.

Updated Date - 2023-11-15T15:44:33+05:30 IST