AnasuyaVijayDeverakonda: పాత గొడవలే కారణమా, అనసూయ భర్తతో తగాదానా

ABN , First Publish Date - 2023-05-07T20:15:59+05:30 IST

అనసూయకి, విజయ్ దేవరకొండ మధ్యలో ఎందుకింత తగాదా వస్తోంది. ఇంతకు ముందు ఈ ఇద్దరి మధ్య నడిచిన మాటల యుద్ధం సమసి పోయింది అనుకున్న సమయంలో మళ్ళీ అనసూయ ఎందుకు విజయ్ ని ఉద్దేశించి ట్వీట్ చేసింది. దీని వెనక కారణం ఇదేనా...

AnasuyaVijayDeverakonda: పాత గొడవలే కారణమా, అనసూయ భర్తతో తగాదానా
Kushi film poster

ప్రముఖ యాంకర్, నటి అనసూయని (Anasuya Bharadwaj) సాంఘీక మాధ్యమంలో మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు. ఆమె విజయ్ దేవరకొండ (VijayDeverakonda) పేరు ముందు 'ది' అని పెట్టుకున్నాడు. దాని మీద అనసూయ సెటైరికల్ గా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దానికి సమాధానంగా విజయ్ అభిమానులు అనసూయ ని ట్రోల్ చేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఇంతకు ఏమైంది ఈ ఇద్దరి మధ్య.

anasuya2.jpg

అప్పుఇదెప్పుడో 'అర్జున్ రెడ్డి' #ArjunReddy సినిమా విడుదల అయినపుడు విజయ్ దేవరకొండ ఏదో చెడ్డ పదం అన్నాడు అని దాని మీద కామెంట్ చేసింది అనసూయ. అప్పట్లో అనసూయ 'జబర్దస్త్' #Jabardasth అనే కామెడీ షో కి యాంకర్ గా ఉండేది. ఆడవాళ్ళకి సంబదించిన ఆర్గనైజషన్స్ కూడా ఆ షో ని నియంత్రించాలని, ఎందుకంటే అందులో ఆడవాళ్ళని కించపరిచే విధంగా, ఇంకా బూతులు కూడా ఎక్కువయ్యాయని అన్నారు. మరి అలాంటి వల్గారిటీ వున్న షో కి యాంకరింగ్ చేసిన అనసూయ, విజయ్ దేవరకొండ సినిమా డైలాగ్స్ మీద కామెంట్ చేస్తే ఎలా అని విరుచుకు పడ్డారు విజయ్ అభిమానులు.

విజయ్ 'మీకు మాత్రమే చెప్తా' #MeekuMatrameChepta అనే సినిమా నిర్మించి అందులో అనసూయకి కూడా ఒక మంచి పాత్ర ఇచ్చి ఆ సినిమాలోకి తీసుకున్నాడు. ఆ సినిమాతో పాత గొడవలు ఇద్దరూ మర్చిపోయారు అని అందరూ అనుకున్నారు. మళ్ళీ 'లైగర్' #Liger సినిమా ప్లాప్ అయినప్పుడు, అనసూయ చాలా హ్యాపీ ఫీల్ అయింది అని తెలిసింది. వెంటనే ట్వీట్ కూడా చేసింది. అయితే ఆ ట్వీట్ చాలా వెటకారంగా విజయ్ ని పరోక్షంగా విమర్శించినట్టుగా చేసింది. దానితో మళ్ళీ విజయ్ అభిమానులు అనసూయ ని ట్రోల్ చేశారు. 'ఆంటీ' #Aunty అన్న పదం కూడా అప్పుడే వచ్చింది. ఆమె సీరియస్ అవటం, విజయ్ అభిమానులు ట్రోల్ చెయ్యడం ఇలా మళ్ళీ మొదలయింది.

vijayd2.jpg

సరే, అది కూడా కాలంతో పాటు మర్చిపోయారు అనుకున్నారు అందరూ. కానీ ఇప్పుడు విజయ్ పేరు ముందు 'ది' అని పెట్టుకున్నాడు. అసలు చెప్పాలంటే, అనసూయకి అది సంబంధం లేదు. అది అతనిష్టం. కావాలంటే ఆమె కూడా పెట్టుకోవచ్చు. ఈమె ఎవరు అడగటానికి అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది. కానీ దాని మీద వెటకారంగా ట్వీట్ చేసింది. ఇంకో ట్వీట్ కూడా 'దొంగ... అని ఆపేసింది. అది ఒక తిట్టు అని తెలుగు తెలిసిన ఎవరికయినా అర్థం అయిపోతుంది. అందులోనే బంగారుకొండలంట.. అంటూ వెటకారంగా పెట్టింది. ఇంతకీ మళ్ళీ ఏమైంది అంటే... ఎదో పార్టీ లో విజయ్, అనసూయ భర్త భరద్వాజ్ కి మధ్యలో ఏవో మాటల యుద్ధం జరిగింది అని అంటున్నారు, మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. భర్తని ఎదో అన్నాడని, రివెంజ్ తీసుకుందుకే మళ్ళీ విజయ్ మీద ఆలా చేసింది అని అంటున్నారు.

Updated Date - 2023-05-07T20:15:59+05:30 IST