Guntur Kaaram: క్లైమాక్స్ చిత్రీకరణలో 'గుంటూరు కారం'

ABN , First Publish Date - 2023-09-28T17:39:13+05:30 IST

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న 'గుంటూరు కారం' క్లైమాక్స్ సన్నివేశాలు షూటింగ్ చేస్తున్నట్టుగా తెలిసింది. ఒక ప్రైవేట్ స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన ఒక ఇంటి సెట్లో ఈ షూటింగ్ జరుగుతున్నట్టుగా తెలిసింది. ఈ సినిమా రానున్న సంక్రాంతికి విడుదల కావాల్సి వుంది.

Guntur Kaaram: క్లైమాక్స్ చిత్రీకరణలో 'గుంటూరు కారం'
A still from Guntur Kaaram

మహేష్ బాబు (MaheshBabu) నటిస్తున్న 'గుంటూరు కారం' #GunturKaaram షూటింగ్ చాలా వేగంగా అవుతున్నట్టుగా సమాచారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ (TrivikramSrinivas) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela) ప్రధాన కథానాయకురాలు కాగా, మీనాక్షి చౌదరి (MeenakshiChaudhary) ఇంకొక కథానాయకురాలిగా చేస్తోంది. సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మాత, థమన్ (SSTHaman) సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా నుండి టీజర్, మహేష్ బాబు లుక్ విడుదలై అవి వైరల్ అయిన సంగతి తెలిసిందే.

sreeleela-gunturkaram.jpg

ఇప్పుడు తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాలు తీస్తున్నట్టుగా తెలుస్తోంది. అన్నపూర్ణ 7 ఎకర్స్ స్టూడియో లో ఈ క్లైమాక్స్ సన్నివేశాలు షూటింగ్ జరుగుతున్నట్టుగా తెలిసింది. ఇందులో మహేష్ బాబు, రమ్యకృష్ణ (RamyaKrishnan), ప్రకాష్ రాజ్ (PrakashRaj), రావు రమేష్ (RaoRamesh), ఇంకా మరికొంతమంది నటులు పాల్గొంటున్నారని, ఈ క్లైమాక్స్ చిత్రీకరణ చాలా ఆసక్తికరంగా వుండబోతోంది అని కూడా తెలిసింది.

సినిమాలో ఒక పెద్ద సస్పెన్స్ వస్తూ ఉంటుందని, ఆ సస్పెన్స్ చివరికి క్లైమాక్స్ లో విప్పుతారని అది ఒక షాకింగ్ సస్పెన్స్ అని అంటున్నారు. ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో మహేష్ కి తాతగా వేస్తుండగా, రమ్యకృష్ణ, జయరాం, రాహుల్ రవీంద్రన్, రవి శంకర్ ఇలా చాలామంది నటీనటులు ఇందులో వున్నారు. ఈ సినిమా రానున్న సంక్రాంతికి విడుదలవుతుందని చిత్ర నిర్వాహకులు చెప్పారు.

Updated Date - 2023-09-28T17:39:13+05:30 IST