Sharwanand and Seerath Kapoor: తొమ్మిదేళ్ల తరువాత 'రన్ రాజా రన్' జంట మళ్ళీ కలుస్తోంది

ABN , First Publish Date - 2023-08-16T13:59:41+05:30 IST

దాదాపు తొమ్మిదేళ్ల తరువాత 'రన్ రాజా రన్' జంట మళ్ళీ కలుస్తోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రాబోయే సినిమాలో శర్వానంద్ పక్కన సీరత్ కపూర్ ని కథానాయకురాలిగా తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా లండన్ లో జరుగుతోందని అంటున్నారు.

Sharwanand and Seerath Kapoor: తొమ్మిదేళ్ల తరువాత 'రన్ రాజా రన్' జంట మళ్ళీ కలుస్తోంది
Sharwanand and Seerat Kapoor

హిందీ నటి సీరత్ కపూర్ (SeeratKapoor) మొదటిసారిగా తెలుగులో ఆరంగేట్రం చేసిన సినిమా శర్వానంద్ (Sharwanand) సరసన 'రన్ రాజా రన్' #RunRajaRun అనే సినిమాలో. అది 2014 ఆగష్టు లో విడుదలై, అప్పట్లో పెద్ద హిట్ అయింది కూడా. ఆ తరువాత సీరత్ కపూర్ చాలా సినిమాలు చేసింది. దాదాపు తొమ్మిదేళ్ల తరువాత శర్వానంద్, సీరత్ కపూర్ మళ్ళీ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ హిట్ పెయిర్ ఇలా మళ్ళీ కనిపించబోతున్నారు అనే వార్త ఆసక్తికరంగా వుంది. (Sharwanand and Seerat Kapoor reunite once again)

seeratkapoor5.jpg

ఇప్పుడు వీళ్ళిద్దరూ జంటగా నటిస్తున్న సినిమాకి దర్శకుడు మరెవరో కాదు 'శ్రీరామ్ ఆదిత్య' (SriramAditya). ఈ సినిమా షూటింగ్ అప్పుడే మొదలయింది అని, లండన్లో షూటింగ్ చేస్తున్నారని కూడా తెలుస్తోంది. సీరత్ కపూర్ తన సాంఘీక మాధ్యమాల్లో లండన్ లో వున్న ఫోటోస్ పోస్ట్ చేస్తోంది అంటే ఆమె ఈ సినిమా కోసం లండన్ వెళ్ళింది అని అంటున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ పక్కన ఎవరు చెయ్యాలి అనుకుంటున్న సమయంలో దర్శకుడు సీరత్ కపూర్ ని ఫైనల్ చేసినట్టుగా తెలిసింది. వీళ్లిద్దరితో ఇంతకు ముందు వచ్చిన 'రన్ రాజా రన్' పెద్ద హిట్ అవటమే ఇందుకు కారణం అని కూడా తెలుస్తోంది. ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ (PeoplesMediaFactory) నిర్మిస్తోంది అని కూడా వార్తలు వస్తున్నాయి.

seeratkapoor4.jpg

దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తన మొదటి సినిమా 'భలే మంచి రోజు' తోనే అందరినీ ఆకర్షించాడు. ఇందులో సుధీర్ బాబు (SudheerBabu) కథానాయకుడు. ఆ తరువాత 'శమంతకమణి', అలాగే నాగార్జున (NagarjunaAkkineni), నాని (Nani) లతో ముల్టీస్టార్ర్ర్ 'దేవదాసు' అనే సినిమాకి కూడా శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. అతని ముందు సినిమా 'హీరో' #Hero వ్యాపారపరంగా అంతగా నడవలేదు. ప్రముఖ రాజకీయ నాయకుడు గల్లా జయదేవ్ (JayadevGalla) కుమారుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు (MaheshBabu) మేనల్లుడు అయిన అశోక్ (AshokGalla) ని ఈ సినిమాలో పరిచయం చేసాడు. కానీ ఈ సినిమా అతను ఆశించినంతగా ఆడలేదు.

seeratkapoor2.jpg

ఇప్పుడు శర్వానంద్ తో ఒక రొమాంటిక్ కామెడీ సినిమా శ్రీరామ్ ప్లాన్ చేసినట్టుగా కనపబడుతోంది. కథకి అనుగుణంగా చాల భాగం షూటింగ్ లండన్ లో చెయ్యాలని కూడా నిర్ణయించినట్టుగా తెలిసింది. శర్వానంద్, సీరత్ ల జంట మళ్ళీ తమ మొదటి సినిమాలాగే ఈ సినిమా కూడా విజయం సాధిస్తారని అనుకుంటున్నారు. సీరత్ ఇప్పుడు ఈ సినిమా కాకుండా దిల్ రాజు నిర్మిస్తున్న 'ఆకాశం దాటి వస్తావా' లో కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తోంది అని తెలిసింది.

Updated Date - 2023-08-16T13:59:41+05:30 IST