Allu Arjun: 'పుష్ప 2' విడుదల తేదీ ఖరారు, ఎప్పుడంటే...

ABN , First Publish Date - 2023-08-29T13:36:52+05:30 IST

జాతీయ ఉత్తమ నటుడిగా మొదటి సారిగా ఒక తెలుగు నటుడు అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాలో నటనకి గాను ఎంపికైన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమా రెండో పార్టు ఎప్పుడు వస్తుందా అని అనుకుంటున్నా సమయంలో, విడుదల తేదీని చిత్ర యూనిట్ ఖరారు చేసిందని భోగట్టా

Allu Arjun: 'పుష్ప 2' విడుదల తేదీ ఖరారు, ఎప్పుడంటే...
Allu Arjun from Pushpa 2: The Rule

అల్లు అర్జున్ (AlluArjun), సుకుమార్ (Sukumar) కాంబినేషన్ లో వస్తున్న 'పుష్ప 2' #Pushpa2 మీదే ఇప్పుడు అందరి కళ్ళూ వున్నాయి. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి పార్టు 'పుష్ప: ది రైజ్' Pushpa: TheRise పెద్ద విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో నటించినందుకు గాను, అల్లు అర్జున్ జాతీయ పురస్కారం, ఉత్తమ నటుడిగా కూడా అందుకున్నాడు. #NationalAward ఇప్పుడు ఈ రెండో పార్టు ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ రెండో పార్టు విడుదల తేదీ 'పుష్ప 2' #Pushpa:TheRule చిత్రం ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే వచ్చే సంవత్సరం వేసవిలో చాలా సినిమాలు విడుదలకి సిద్ధం అవుతున్నాయి. అందుకని 'పుష్ప 2' కొంచెం ముందుగానే రావటానికి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. అందుకే పుష్ప విడుదల తేదీని మార్చ్ 22, 2024 (March22, 2024) గా ఖరారు చేసినట్టుగా ఒక భోగట్టా. ఇదే విషయాన్ని రానున్న రోజుల్లో ఆ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించ నున్నదని తెలుస్తోంది.

pushpatherule.jpg

ప్రస్తుతం 'పుష్ప 2' షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మొదటి పార్టు కన్నా, రెండో పార్టులోనే విషయం ఎక్కువ ఉందని అర్థం అవుతోంది. ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ అమ్మోరు వేషంలో వున్న లుక్ కి విశేష ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. అలాగే అల్లు అర్జున్ పుట్టినరోజు నాడు విడుదలైన ఈ సినిమా టీజర్ కూడా విశేషంగా ప్రేక్షకులు ఆదరించారు. అందుకని ఈ సినిమా మీద అంచనాలు బాగా వున్నాయి. ఈ సినిమా వ్యాపార పరంగా కూడా రికార్డు సృష్టించే దిశగా వెళ్లొచ్చు అని కూడా అంటున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే, ఈ సినిమాకి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (National Award for Best Actor) ఎంపికవడం, ఈ సినిమా అంచనాలని ఇంకా పెంచింది అని కూడా అంటున్నారు. మొదటిసారిగా ఒక తెలుగు నటుడికి వుత్తమ నటుడిగా జాతీయ పురస్కారం రావటం ఇదే మొదటిసారి. అల్లు అర్జున్ ని గత కొన్ని రోజులుగా పరిశ్రమ నుండి, ఇతర రంగాలనుండి చాలామంది అభినందించారు. ఇప్పటి నుండి షూటింగ్ ఎక్కడా ఆగకుండా జరిగితే కనక వాళ్ళు అనుకున్న మార్చ్ 22 వ తేదీకి రాగలరు అని కూడా అంటున్నారు. ఇందులో రష్మిక మందన్న (RashmikaMandanna) కథానాయిక కాగా, అనసూయ, ఫహాద్ ఫాజిల్ (FahadhFaasil), రావు రమేష్ (RaoRamesh), జగపతి బాబు (JagapathiBabu), బ్రహ్మాజీ (Brahmaji) ప్రముక్త పాత్రల్లో నటిస్తున్నారు.

Updated Date - 2023-08-29T13:36:52+05:30 IST