సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

NiharikaMarriage: నాగబాబు కూతురేమో అక్కడెక్కడో మండుటెండలో, అల్లుడేమో తిరుపతిలో... కథ కంచికేనా..

ABN, First Publish Date - 2023-05-26T15:55:21+05:30

ఈరోజు తిరుపతిలో నాగబాబు అల్లుడు శ్రీవారిని దర్శనం చేసుకోవడానికి కుటుంబంతో వెళ్లగా, అక్కడ అతని భార్య నిహారిక కొణిదెల మిస్సింగ్. అదే సమయం లో నిహారిక తన ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడో మండుటెండలో నిలబడి వున్న ఫోటోస్ పోస్ట్ చేసింది. అంటే కథ కంచికే కదా అని అర్థం అవుతోంది అంటున్నారు

File picture of Siddhu Jonnalagadda and Niharika Konidela
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi) తమ్ముడు నాగబాబు (Nagababu Konidela) కూతురు నిహారిక కొణిదెల (Niharika Konidela), అల్లుడు జొన్నలగడ్డ చైతన్య (Jonnalagadda Chaitanya) వివాహం గురించి వార్తలు వస్తూనే వున్నా, రెండు కుటుంబాల తరపున ఎటువంటి అధికారిక వార్త రాలేదు. అయితే శుక్రవారం ఒక ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. అది ఏంటంటే నాగబాబు అల్లుడు జొన్నలగడ్డ వెంకట చైతన్య, కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అయిన తరువాత మామూలుగా అక్కడున్న మీడియా వాళ్ళతో అందరూ మాట్లాడినట్టే ఈ కుటుంబ సభ్యులు కూడా ఫోటోలకి పోజులు ఇచ్చారు అని తెలిసింది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే, ఈ కుటుంబ సభ్యులతో పాటు వారి కోడలు, చైతన్య భార్య అయిన నిహారిక కొణిదెల (Niharika Konidela) లేకపోవటం.

మరి నిహారిక ఎక్కడుందీ అంటే, ఆమె ఎక్కడో మండుటెండలో నిలబడి పోజులు ఇచ్చిన రెండు ఫోటోస్ ఆమె ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అంటే ఆమె తిరుపతి కాదు కదా, కనీసం ఆ కుటుంబంతో టచ్ లో కూడా లేనట్టు కనపడుతోంది. దీన్ని బట్టి వీళ్ళిద్దరూ విడిపోయారని అందరూ ఖరారు చేసుకుంటున్నారు అని తెలిసింది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా వీరిద్దరి వివాహం మీద చాలా వార్తలు వచ్చాయి.

నిహారిక కూడా మళ్ళీ తన సినిమా, వెబ్ సిరీస్, ప్రొడక్షన్ వర్క్ తో చాలా బిజీ అయిపొయింది. ఈమధ్యనే ఆమె నటించిన 'డెడ్ పిక్సల్స్' (DeadPixels) అనే వెబ్ సిరీస్ కూడా విడుదల అయింది. అలాగే ఆమె మొదలు పెట్టిన 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' మీద ఒక సినిమా కూడా మొదలెట్టినట్టు కనపడుతోంది. అంటే ఆమె పనుల్లో ఆమె బిజీ గా ఉంటే, చైతన్య అతని పని అతను చూసుకుంటున్నాడు. అంతే ఎవరికి వారు యమునా తీరే అన్నట్టుగా ఇద్దరూ ఉంటే, ఇంకేమి చెప్పనవసరం లేదు దీన్ని బాతి కథ కంచికే చేరిపోయింది అని అర్థం అయిపొయింది అని అంటున్నారు అందరూ.

Updated Date - 2023-05-26T15:55:21+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!