Manchu Lakshmi: ప్రధానమంత్రి ఆఫీస్ నుండి పిలుపు, పార్టీలో చేరడానికేనా !

ABN , First Publish Date - 2023-09-20T14:14:20+05:30 IST

ప్రముఖ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కుమార్తె లక్ష్మి ఇటు నటనలోనూ, అటు సాంఘీక మాధ్యమంలోనూ, అలాగే ఏదైనా సంఘటన మీద తనదైన రీతిలో తన స్పందనను మొహమాటం లేకుండా చెప్పే వ్యక్తి. లక్ష్మి కి రేపు ఢిల్లీకి రమ్మని ప్రధానమంత్రి కార్యాలయం నుండి పిలుపు వచ్చింది. ఇంతకీ ఆ పిలుపు దేనికోసమో...

Manchu Lakshmi: ప్రధానమంత్రి ఆఫీస్ నుండి పిలుపు, పార్టీలో చేరడానికేనా !
Manchu Lakshmi

తాజా సమాచారం ప్రకారం మంచు లక్ష్మి (ManchuLakshmi) కి ప్రధానమంత్రి (PMO) ఆఫీస్ నుండి పిలుపు వచ్చిందని తెలుస్తోంది. అయితే ఈ పిలుపు ఎందుకోసమని పలు ఊహాగానాలు బయలుదేరాయి. రేపు మంచు లక్ష్మి ప్రధానమంత్రిని కలవనున్నారు అని తెలిసింది. మంచు కుటుంబంతో #ManchuFamily ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (NarendraModi) కి మంచి సన్నిహిత సంబంధాలు వున్నాయి. ఇంతకు ముందు చాలా సార్లు మోహన్ బాబు (MohanBabu) కుటుంబం ప్రధానమంత్రిని కలిశారు.

ఇప్పుడు మంచు లక్ష్మి కి పిలుపు రావటంతో ఆమెని పార్టీలోకి ఆహ్వానించడానికి ఢిల్లీకి పిలిపిస్తున్నట్టుగా ఆమె సన్నిహితులు చెపుతున్నారు. ఎందుకంటే ఇటు ఆంధ్ర, అటు తెలంగాణాలో ఇప్పుడు బీజేపీ తమ బలాన్ని పెంచుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే మంచు లక్ష్మిని పార్టీలోకి ఆహ్వానించడానికి ఈ పిలుపు అని కూడా అంటున్నారు. ఒకవేళ పార్టీలో చేరమంటే లక్ష్మి చేరడానికి అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు.

manchulakshmi1.jpg

ఇంకో పక్క మహిళా బిల్లును కేంద్ర కాబినెట్ ఆమోదించిన నేపథ్యంలో దాని మీద కూడా చర్చ జరిగే అవకాశాలున్నాయని, అందుకోసం దేశం నుండి చాలామంది పేరున్న మహిళలను పిలిపించి మాట్లాడతారు అని, అందులో భాగంగా మంచు లక్ష్మిని పిలిచి ఉంటారని కూడా అంటున్నారు. ఏమైనా మంచు లక్ష్మి రేపు చెయ్యబోయే ఢిల్లీ పర్యటన పలు ఊహాగానాలకు తావిస్తోంది.

Updated Date - 2023-09-20T14:14:20+05:30 IST