MegaStar Chiranjeevi: అప్పుడు శృతి హాసన్, ఇప్పుడు తమన్నా.. ఇద్దరూ ఏంటి ఇలా చేశారు

ABN , First Publish Date - 2023-08-08T13:55:29+05:30 IST

అప్పట్లో శృతి హాసన్, ముందురోజు బాలకృష్ణ నటించిన 'వీరసింహారెడ్డి' ప్రీ రిలీజ్ వేడుకకి వెళ్ళింది, మరుసటి రోజు చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి హాజరు రాలేదు. సిక్ అయ్యాను అని ఆమె చెప్పింది, కానీ అప్పట్లో ఆమెని ట్రోల్ చేశారు. అలాగే ఇప్పుడు 'భోళా శంకర్' ప్రీ రిలీజ్ వేడుకకి తమన్నా రాలేదు.

MegaStar Chiranjeevi: అప్పుడు శృతి హాసన్, ఇప్పుడు తమన్నా.. ఇద్దరూ ఏంటి ఇలా చేశారు
Shruti Haasan and Tamannaah Bhatia

చిరంజీవి (Chiranjeevi) నటించిన 'భోళాశంకర్' #BholaaShankar ప్రీ రిలీజ్ వేడుక కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో అయింది. మెహెర్ రమేష్ (MeherRamesh) దీనికి దర్శకుడు, అనిల్ సుంకర (AnilSunkara) నిర్మాత. కీర్తి సురేష్ (KeerthySuresh), తమన్నా (TamannahBhatia) ఇందులో నటించగా, కీర్తి సురేష్, చిరంజీవికి చెల్లెలుగా ఈ సినిమాలో నటించింది. అయితే ఈ వేడుకకి చిత్రానికి సంబంధించి అందరూ వచ్చారు కానీ, అసలైన తమన్నా మాత్రం రాలేదు.

ఇదేమీ మొదటి సారి కాదు ఇలా కథానాయకురాలు రాకపోవటం, అది కూడా చిరంజీవి నటించిన సినిమాకి. ఆమధ్య చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' #WaltairVeerayya సినిమా ప్రీ రిలీజ్ వేడుక కూడా అయింది. అందులో శృతి హాసన్ (ShrutiHaasan) కథానాయిక కాగా, ఆమె కూడా ఆ వేడుకకి రాకుండా వొంట్లో బాగోలేదని చెప్పి వేరే ఈవెంట్ కి అటెండ్ అయింది అని అన్నారు. అప్పట్లో శృతి హాసన్ రాకపోవటం మీద కొన్ని వార్తలు కూడా వైరల్ అయ్యాయి.

bholaashankar4.jpg

చిరంజీవి అప్పట్లో శృతి హాసన్ రాకపోవటం మీద జోక్ వేశారు. ముందురోజు ఫంక్షన్ లో ఏమి తినిందో పాపం సిక్ అయి ఈ ఫంక్షన్ కి రాలేదు అని చెప్పారు. అంటే శృతి హాసన్ అప్పుడు చిరంజీవి 'వాల్తేర్ వీరయ్య' సినిమాలోనూ, అలాగే నందమూరి బాలకృష్ణ (NandamuriBalakrishna) నటించిన 'వీరసింహ రెడ్డి' #VeerasimhaReddy సినిమాలోనూ కథానాయకురాలిగా నటించింది. రెండు సినిమాలు ఒకరోజు తరువాత ఒకటి విడుదలయ్యాయి. బాలకృష్ణ నటించిన సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి హాజరైంది, కానీ చిరంజీవి సినిమా ప్రీరిలీజ్ వేడుకకి హ్యాండ్ ఇచ్చేసింది అన్నారు. అందుకని చిరంజీవి సెటైరికల్ గా అప్పుడు శృతి హాసన్ మీద ఆలా మాట్లాడేరు.

tamannaah1.jpg

ఇప్పుడు తమన్నా కూడా అంతే ! ఆగస్టు 10 వ తేదీన విడుదలవుతున్న రజనీకాంత్ (Rajinikanth) సినిమా 'జైలర్' #Jailer లో ఆమె కథానాయకురాలు, అలాగే మరుసటి రోజు అంటే ఆగస్టు 11వ తేదీన విడుదలవుతున్న చిరంజీవి 'భోళాశంకర్' లో కూడా ఆమే కథానాయకురాలు. ఆమె ముంబైలో ఒక మేకప్ ఆర్టిస్టు ఓపెన్ చేసిన సెలూన్ ఓపెనింగ్ కి వెళ్లాల్సి వచ్చింది అని అన్నారు. అయితే చిరు అభిమానులు ఆమెకి తెలుగు సినిమా కన్నా, సెలూన్ ఓపెనింగ్ కి వెళ్ళటమే ఎక్కువయిపోయింది అని విమర్శించారు కానీ, తమ్మన్న ఎప్పుడో ఒప్పుకుంది వస్తాను అని, అందుకు వెళ్ళింది అని అన్నారు. ఇలా కథానాయికలు అగ్రనటులు నటించిన సినిమా ప్రీ రిలీజ్ వేడుకలకి రాకపోవటం కూడా పెద్ద వార్త అయి వైరల్ అవుతూ ఉంటుంది.

Updated Date - 2023-08-08T13:55:29+05:30 IST