Guntur Kaaram: గ్యాప్ లేకుండా షూటింగ్ చేస్తున్నారు, సంక్రాంతికి రెడీ అంటున్నారు

ABN , First Publish Date - 2023-09-14T16:57:16+05:30 IST

మూడు రోజులు కోఠి లోని ఉమెన్స్ కాలేజీలో షూటింగ్ చేసిన 'గుంటూరు కారం' ఇప్పుడు వేరే దగ్గరకికి షిఫ్ట్ అయింది. దర్శకుడు శ్రీనివాస్ చాలా వేగంగా షూటింగ్ చేస్తున్నారని, ఇలా చేస్తే సంక్రాంతికి రావటం ఖాయం అని అంటున్నారు.

Guntur Kaaram: గ్యాప్ లేకుండా షూటింగ్ చేస్తున్నారు, సంక్రాంతికి రెడీ అంటున్నారు

మహేష్ బాబు (MaheshBabu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (TrivikramSrinivas) కాంబినేషన్ లో వస్తున్న 'గుంటూరు కారం' #GunturKaaram సినిమా షూటింగ్ హైద్రాబాదులో అవిశ్రాంతంగా జరుగుతోంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా వేగంగా సన్నివేశాలు అన్నీ షూటింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ వేగాన్ని చోస్తుంటే, సంక్రాంతికి సినిమా రెడీ అయ్యేట్టుగా వుంది అని అంటున్నారు. మొన్నటి వరకు కోటి లోని ఉమెన్స్ కాలేజీలో ప్రకాష్ రాజ్ (PrakashRaj), రమ్యకృష్ణ (RamyaKrishna), రావు రమేష్ (RaoRamesh), మురళి శర్మ (MuraliSharma) ఇంకా తదితరుల మీద కొన్ని సన్నివేశాలు చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది.

ఆ సన్నివేశాల్లో కథానాయకుడు మహేష్ బాబు లేడు అని, ఆ కాలేజీలో ఒక మూడు నాలుగు రోజుల పాటు షూటింగ్ చేసినట్టుగా తెలిసింది. ఇప్పుడు షూటింగ్ ఒక హోటల్ లోకి మారినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక్కడ మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ ల మీద కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టుగా అర్థం అవుతోంది అని అంటున్నారు.

sreeleela-gunturkaram.jpg

ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela) ప్రధాన కథానాయకురాలు కాగా, మీనాక్షి చౌదరి (MeenakshiChaudhary) ఇంకొక కథానాయకురాలిగా చేస్తోంది. మహేష్ బాబు కి తాతగా ప్రకాష్ రాజ్ కనపడనున్నాడు అని, అతను ఒక రాజకీయ నాయకుడి పాత్ర వేస్తున్నాడు ఇప్పటి వరకు అయిన షూటింగ్ బట్టి అని తెలుస్తోంది. అలాగే శ్రీలీల చాలా సినిమాలు చేస్తూ ఉండటంతో, ఈ సినిమాకి కూడా కొన్ని రోజులు షూటింగ్ కేటాయించిందని తెలుస్తోంది. మీనాక్షి చౌదరి మీద కూడా చాలా సన్నివేశాలు ఇప్పటికే చిత్రీకరించారని కూడా అర్థం అవుతోంది.

మొత్తం మీద షూటింగ్ అయితే నిర్విరామంగా, గ్యాప్ లేకుండా కంటిన్యూగా సాగుతోంది. ఇలా కొన్ని రోజులు చేసుకుంటూ పోతే, సంక్రాంతికి సినిమా విడుదల ఖాయం అని యూనిట్ సభ్యులు అంటున్నారు. ఈ సినిమాకి నిర్మాత సూర్యదేవర నాగవంశి.

Updated Date - 2023-09-14T16:57:16+05:30 IST