Guntur Karam: పీఎస్ వినోద్ ప్లేస్ లో ఇతనే కొత్త సినిమాటోగ్రాఫర్ !

ABN , First Publish Date - 2023-08-08T12:24:08+05:30 IST

ఎట్టకేలకు 'గుంటూరు కారం' సినిమా కోసం కొత్త సినిమాటోగ్రాఫర్ వస్తున్నాడు. ఇంతకు ముందు పని చేసిన పీఎస్ వినోద్ ఈ సినిమా నుండి తప్పుకోవడంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు కొత్త సినిమాటోగ్రాఫర్ రావటంతో ఈనెలలో షూటింగ్ మొదలెట్టొచ్చు అని అంటున్నారు. ఇంతకు ఆ కొత్త సినిమాటోగ్రాఫర్ ఎవరంటే...

Guntur Karam: పీఎస్ వినోద్ ప్లేస్ లో ఇతనే కొత్త సినిమాటోగ్రాఫర్ !
Mahesh Babu in Guntur Karam

మహేష్ బాబు (MaheshBabu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (TrivikramSrinivas) కాంబినేషన్ లో వస్తున్న 'గుంటూరు కారం' #GunturKaram సినిమా షూటింగ్ మొదలవుతోంది అనడం, మళ్ళీ అది వాయిదాలు పడటం జరుగుతూనే వుంది. మహేష్ బాబు ప్రస్తుతం లండన్ లో కుటుంబంతో సహా వెకేషన్ లో వున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన 'బ్రో' #Bro:TheAvatar సినిమాకు పని చేసి, ఇప్పుడిప్పుడే మహేష్ బాబు సినిమా మీద దృష్టి పెట్టినట్టుగా తెలిసింది. అయితే ఈ సినిమాకి పనిచేస్తున్న సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ (PSVinod) ఈ సినిమా నుండి తప్పుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.

ఇప్పుడు వినోద్ స్థానంలో కొత్త సినిమాటోగ్రాఫర్ ని తీసుకున్నట్టుగా తాజా సమాచారం. అతను మరెవరో కాదు, మనోజ్ పరమహంస (ManojParamahamsa) ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా వచ్చిన్నట్టుగా తెలిసింది. మనోజ్ పరమహంస పెద్ద సినిమాలకు పని చేసిన అనుభవం వుంది. ఈమధ్య కాలంలో అతను ప్రభాస్ (Prabhas) నటించిన 'రాధే శ్యామ్' #RadheShyam కి పని చేసాడు, అలాగే విజయ్ నటించిన 'బీస్ట్' #Beast కి కూడా అతనే సినిమాటోగ్రఫర్ గా పని చేసాడు. అతను విజయ్, లోకేష్ కనకరాజ్ (LokeshKanagaraj) కాంబినేషన్ లో రాబోతున్న 'లియో' #Leoకి కూడా పని చేసాడు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ (GautamVasudevMenon) దర్శకత్వంలో విక్రమ్ (ChiyanVikram) నటిస్తున్న 'ధ్రువ నచ్చతిరం' (Dhruva Natchathiram) సినిమాకి కూడా పరమహంసే సినిమాటోగ్రాఫర్.

manojparamahamsa.jpg

త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ లో వస్తున్న 'గుంటూరు కారం' #GunturKaram సినిమాకి ఇతన్ని సినిమాటోగ్రాఫర్ తీసుకువచ్చినట్టుగా తెలిసింది. షూటింగ్ ఆగష్టు 16 నుండి అని కూడా అంటున్నారు. మనోజ్ పరమహంస తన తమిళ్ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి చేసుకొని ఆరోజు కి హైదరాబాద్ వస్తాడు అని తెలిసింది. ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ వచ్చాడు కాబట్టి, సినిమా షూటింగ్ సజావుగా సాగుతుందని ఆ చిత్ర బృందం భావిస్తోందని తెలుస్తోంది. శ్రీలీల (Sreeleela), మీనాక్షి చౌదరి (MeenkashiChaudhary) ఇందులో కథానాయకులుగా నటిస్తున్నారు.

Updated Date - 2023-08-08T12:24:08+05:30 IST